సర్వేశ్వ రుడికే ఎరుక !
న్యూస్టుడే: కరోనా మహమ్మారి నియంత్రణకు.. బాధితులను గుర్తించి త్వరితగతిన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన జ్వర సర్వేలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. జ్వరాలను గుర్తించి.. పరీక్షలు నిర్వహించి.. వ్యాధి నిర్ధారణ చేసి.. వైద్య సేవలను అందించాలని గొప్ప
ఇదీ జిల్లాలో జ్వర సర్వే పరిస్థితి
సొంత లెక్కలు వేస్తున్న సిబ్బంది
సిబ్బందికి సూచనలిస్తున్న రాష్ట్ర పరిశీలకుడు ఆర్.ఆర్.రెడ్డి (పాతచిత్రం)
చిత్తూరు (వైద్యవిభాగం), న్యూస్టుడే: కరోనా మహమ్మారి నియంత్రణకు.. బాధితులను గుర్తించి త్వరితగతిన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన జ్వర సర్వేలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. జ్వరాలను గుర్తించి.. పరీక్షలు నిర్వహించి.. వ్యాధి నిర్ధారణ చేసి.. వైద్య సేవలను అందించాలని గొప్ప లక్ష్యమున్నా.. సిబ్బంది సొంత లెక్కలు వేస్తూ తూతూమంత్రంగా చేపడుతున్నారు.
జిల్లాలో రెండేళ్లలో 34 జ్వర సర్వేలు చేశారు. కొవిడ్ ఉద్ధృతమయ్యేలోగా 35వ సర్వే చేయాలని భావించినా 55.38 శాతం మాత్రమే పూర్తయింది. ప్రతి సచివాలయం పరిధిలోని వార్డు వాలంటీర్లు, ఆశా కార్యర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటిని సందర్శించి.. ఆరోగ్య పరంగా పలు ప్రశ్నలను అడగాలి. వాలంటీరు యాప్లో ఉన్న సుమారు 33 అనారోగ్య సమస్యలకు సంబంధించి వివరాలు నమోదు చేయాలి. వాటి ఆధారంగా సదరు ఆరోగ్య సిబ్బంది మళ్లీ కుటుంబ సభ్యులను పలకరించి.. జ్వరం, దగ్గు ఉన్నట్లు తేలితే.. ఆరోగ్య సిబ్బంది డెంగీ, మలేరియా, కొవిడ్.. తదితర పరీక్షలు చేసి వాటి ఫలితాలు వెల్లడించాలి. జ్వరం, దగ్గు ఉన్న బాధితులకు కొవిడ్ కిట్లను అందించి, వారం రోజుల పాటు హోం ఐసోలేషన్ ఉండాలని సూచించి.. పర్యవేక్షించాలి. ఇలా కొన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా జరుగుతున్నా.. అత్యధిక ప్రాంతాల్లో యాప్లో ఉన్న అన్ని కాలమ్స్కు లేదు.. లేదు.. లేదు అని అప్లోడ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇంటింటి సర్వే క్షేత్రస్థాయిలో పకడ్బందీగా జరిగితే సాధారణ జ్వరాలు, కొవిడ్ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది.
3,316 పరీక్షలు.. 1,822 కేసులు
జిల్లాలో గత 24 గంటల్లో 3,316 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 1,822 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. ఒకరు మృతి చెందారు. తిరుపతిలో 506, చిత్తూరులో 266, మదనపల్లెలో 86, శ్రీకాళహస్తిలో 84, చంద్రగిరిలో 81, పుత్తూరులో 56, పాకాలలో 50, పూతలపట్టులో 46 కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ పరిధిలో 19 వేల కిట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. పీహెచ్సీలకు వెళ్తే పరీక్షల కోసం రెండు, వ΄డ్రోజులు ఆగాలనే సమాధానం వస్తోంది.
పూతలపట్టు: కొవిడ్ భయంతో విద్యార్థులను పాఠశాల నుంచి ఇళ్లకు తీసుకెళ్తున్న తల్లిదండ్రులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు