పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణాల్ని ప్రారంభించాలి
జిల్లాలో పెండింగ్లో ఉన్న 9,377 గృహ నిర్మాణాల్ని వెంటనే ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. గృహ నిర్మాణాల ప్రగతిపై సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
మాట్లాడుతున్న కలెక్టర్ హరినారాయణన్
చిత్తూరు(జిల్లా సచివాలయం), న్యూస్టుడే: జిల్లాలో పెండింగ్లో ఉన్న 9,377 గృహ నిర్మాణాల్ని వెంటనే ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. గృహ నిర్మాణాల ప్రగతిపై సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాకు మంజూరైన 72,272 గృహాల్లో 51,594 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ జరగని వాటిని నమోదుచేసి, నిర్మాణాల్ని ప్రారంభించేలా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల వారీగా ప్రారంభానికి నోచుకోని గృహాల వివరాలతోపాటు ఇసుక, ఇటుకల లభ్యతపై సమీక్షించారు. ● సమగ్ర భూసర్వేలో భాగంగా గ్రామాల్లో డ్రోన్ సర్వేను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. డ్రోన్ సర్వే తర్వాత ఓఆర్ఐ షీట్ల తయారీ తర్వాత గ్రౌండ్ ట్రూథింగ్ చేయాలన్నారు. 118 గ్రామాల్లో డ్రోన్ సర్వే ప్రారంభం కాగా.. 31 గ్రామాల్లో ఓఆర్ఐ షీట్లు వచ్చినట్లు చెప్పారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో నోటిఫికేషన్-13ను వెలువరించాలని సూచించారు. ● ఉపాధి పనుల్లో భాగంగా ప్రతి పంచాయతీ పరిధిలో వంద మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో జిల్లా సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువులు, సప్లై ఛానల్స్ వద్ద ఆక్రమణల్ని తొలగిస్తూ పనులు పూర్తి చేయాలన్నారు. స్పందన అర్జీలు సకాలంలో పరిష్కరించాలని, గృహ నిర్మాణాల నిమిత్తం రుణాల మంజూరు వేగవంతం చేయాలని సూచించారు. ఓటీఎస్, భూ రికార్డుల స్వచ్ఛీకరణ పనులపై ప్రగతి సాధించాలని పేర్కొన్నారు. జేసీ వెంకటేశ్వర్, డీఆర్వో రాజశేఖర్, డ్వామా పీడీ చంద్రశేఖర్, జిల్లా సర్వే శాఖ ఇన్స్పెక్టర్ లత, జడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి, గృహనిర్మాణ సంస్థ పీడీ పద్మనాభం ఇతర అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434