వైకాపా గెలుపు కిరీటానికి కుప్పం వజ్రం
రాష్ట్రం మొత్తం వైకాపా గెలిచి సీఎం జగన్మోహన్రెడ్డికి కిరీటం పెట్టినా.. కుప్పం గెలుపు వజ్రం వంటిదని చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ అన్నారు. వైకాపా నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.
ఎమ్మెల్సీ భరత్
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ భరత్, పక్కన ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ రమేష్, జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు
కుప్పం పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రం మొత్తం వైకాపా గెలిచి సీఎం జగన్మోహన్రెడ్డికి కిరీటం పెట్టినా.. కుప్పం గెలుపు వజ్రం వంటిదని చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ అన్నారు. వైకాపా నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సిఫార్సు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందేవని ఆరోపించారు. ఇప్పుడు సభ్యత్వ నమోదుకు రూ.100 వసూలు చేస్తున్నారని విమర్శించారు. వైకాపా దెబ్బకు చంద్రబాబు కుప్పంలో సొంతిల్లు కట్టుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ఇక్కడే ఓటరుగా సైతం నమోదు చేసుకుంటారన్నారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో వైకాపా నాయకులు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు త్వరలో మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొందరు అసంతృప్తితో ఉన్నారని అందరినీ కలుపుకొని సమష్టిగా ముందుకెళ్దామన్నారు. కార్యక్రమంలో కడప ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, రెస్కో ఛైర్మన్ సెంథిల్కుమార్, మున్సిపల్ ఛైర్మన్ డా.సుధీర్, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీ, సర్పంచులు తదితరులు ఉన్నారు.
కుర్చీలు ఖాళీ అయ్యి.. తలుపులు బిగించి..
వైకాపా నియోజకవర్గ ప్లీనరీ సమావేశం జరుగుతున్నప్పుడు మధ్యలో కార్యకర్తలు సభ నుంచి వెనుదిరిగారు. ఇంతలో సమావేశం నిర్వహిస్తున్న ప్రైవేటు కల్యాణ మండపం తలుపులు బిగించి ఎవరూ బయటకు వెళ్లకుండా నియంత్రించేందుకు యత్నించారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడే సమయానికి సగం కూర్చీలు ఖాళీ అయ్యాయి. సభ అరగంటలో పూర్తవుతుందని నాయకులు ఎంత కోరినా కార్యకర్తలు వినిపించుకోకుండా బయటకు వెళ్లిపోయారు.
అందరి బాధలు తీర్చండి..
కుప్పంపై శీతకన్ను మానితేనే భవిష్యత్తు ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గెలుస్తారని శాంతిపురం ఎంపీపీ భర్త, వైకాపా నాయకుడు కోదండరామిరెడ్డి అన్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని.. అందరి బాధలు తీర్చాలన్నారు. పక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, నిధుల పంపిణీలో కుప్పంపై శీతకన్ను కారణంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధిష్టానం స్పందించి అన్ని నియోజకవర్గాల మాదిరిగానే కుప్పాన్ని చూడాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం