logo

యువగళం విజయవంతానికి ‘మట్టి భోజనం’

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని, నగరిలోని చంద్రబాబునాయుడు అభిమానులు తమిళ సంస్కృతిలో పిలిచే (మన్‌సోరు) మట్టి భోజనం చేసి ప్రార్థించారు.

Published : 27 Jan 2023 02:35 IST

దేవాలయంలో మట్టి భోజనం చేస్తున్న అభిమానులు

నగరి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని, నగరిలోని చంద్రబాబునాయుడు అభిమానులు తమిళ సంస్కృతిలో పిలిచే (మన్‌సోరు) మట్టి భోజనం చేసి ప్రార్థించారు. సామాలమ్మ దేవాలయం ఆవరణలో ఆర్‌.చలపతి, మాజీ కౌన్సిలర్‌ లత ఆధ్వర్యంలో తెలుగు మహిళలు గురువారం ఈ మట్టి భోజనం చేసి, అమ్మవారికి పూజలు చేశారు. చంద్రబాబునాయుడు, లోకేష్‌ చిత్రపటాలతో పాదయాత్ర విజయవంతం కావాలంటూ నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని