సామాన్య భక్తులకు త్వరగా దర్శనం
‘భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో నవంబరు 1 నుంచి సర్వదర్శన టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు నిర్వహిస్తున్నాం.
తితిదే ఈవో ధర్మారెడ్డి
గౌరవ వందనం స్వీకరిస్తున్న తితిదే ఈవో ధర్మారెడ్డి
తిరుపతి(తితిదే), న్యూస్టుడే: ‘భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో నవంబరు 1 నుంచి సర్వదర్శన టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. సామన్య భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించి ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు డిసెంబరు 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. దీనిపై రెండు నెలల పరిశీలన తరువాత తుది నిర్ణయం తీసుకుంటాం’ అని తితిదే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వెనుక మైదానంలో గురువారం ఈవో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తితిదే సీవీఎస్వో నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో పరేడ్ కమాండర్ ఏవీఎస్వో విశ్వనాధం నేతృత్వంలో గౌరవ వందనం స్వీకరించారు. ఈవో మాట్లాడుతూ.. ‘రూ.120 కోట్ల టాటా సంస్థ విరాళంతో తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. దాత మురళీకృష్ణ సహాయంతో రూ.23 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి మొదటి వారంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాం. శ్రీవారి లడ్డూలను మరింత నాణ్యతగా, ఎక్కువగా తయారు చేసేందుకు వీలుగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ విరాళంగా అందించే రూ.50 కోట్లతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తాం. క్యూఆర్ కోడ్ విధానం విజయవంతమైన నేపథ్యంలో త్వరలో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం. రూ.15 కోట్ల విలువ చేసే 10 విద్యుత్ బస్సులను విరాళంగా అందించేందుకు ఒలెక్ట్రా సంస్థ ముందుకు వచ్చింది. వీటిని ఏప్రిల్ చివరి వారంలో అందిస్తారు. ధర్మరథాల స్థానంలో నడుపుతాం. తిరుమలలోని ఆకాశగంగ వద్దగల అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా గుర్తించి దాతలు మురళీకృష్ణ, నాగేశ్వరరావు సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం’ అని తెలిపారు. జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, డీఎల్వో రెడ్డప్పరెడ్డి, సీఈ నాగేశ్వరరావు, ఎఫ్ఏసిఏవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన జాగిలాల ప్రదర్శన
తితిదే పరిపాలనా భవనం వెనుక ఉన్నపరేడ్ మైదానంలో తితిదే జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తితిదే విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.