ప్రయాణికుల హితం.. ప్రమాద రహితం
జాగ్రత్తగా విధులు నిర్వహిస్తూ.. రోడ్డుపై ప్రయాణించే తోటి వాహనచోదకులు, పాదచారుల భద్రతను చూసుకున్నారు. ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని అంచనా వేస్తూ చాకచక్యంగా వ్యవహరిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
జిల్లాలో ఉత్తమ డ్రైవర్లుగా గుర్తింపు
- న్యూస్టుడే, తిరుపతి(ఆర్టీసీ)
జాగ్రత్తగా విధులు నిర్వహిస్తూ.. రోడ్డుపై ప్రయాణించే తోటి వాహనచోదకులు, పాదచారుల భద్రతను చూసుకున్నారు. ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని అంచనా వేస్తూ చాకచక్యంగా వ్యవహరిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ ముగ్గరు డ్రైవర్లు. జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల్లో పనిచేస్తున్న వీరు 30 ఏళ్లకుపైగా సర్వీసులో ప్రమాద రహిత డ్రైవర్లుగా పేరుగాంచారు. వీరికి ఆర్టీసీ గుర్తింపు ఇచ్చి శనివారం అలిపిరి డిపోలో జరిగిన 34వ రోడ్డు భద్రతా వారోత్సవాలలో తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి వై.వీర్రాజు, ఆర్టీవో సీతారామిరెడ్డి, జిల్లా ప్రజా రవాణాధికారి చెంగల్రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలతో పాటు ప్రోత్సాహక నగదు బహుమతులు అందుకున్నారు.
12 దఫాలు ప్రశంసలు
వాకాడు డిపోకు చెందిన భక్తవత్సలం(60) 1989 నుంచి ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. మొదట గూడూరు డిపోలో 7 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత నుంచి వాకాడులో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కోట- నాయుడుపేట, మల్లాం- నాయుడుపేట సర్వీసులు నడుపుతున్నారు. ఇప్పటివరకు చిన్న ప్రమాదం కూడా చేయకుండా ప్రమాద రహిత డ్రైవర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో నెల్లూరు రీజియన్ పరిధిలో పనిచేస్తున్న సమయంలో 12 దఫాలుగా నెల్లూరులో ఉత్తమ డ్రైవర్గా ప్రశంసలు అందుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా వాకాడు డిపో తిరుపతి జిల్లా పరిధిలోకి రావడంతో ఈ ఏడాది ప్రమాద రహిత డ్రైవర్గా జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు.
చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ప్రయాణికులకు చిరునవ్వుతో సమాధానం ఇస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తించడం ద్వారా తనకు ఈ గుర్తింపు వచ్చిందని భక్తవత్సలం తెలిపారు.
దూరప్రాంతాలకు నడిపిన అనుభవం
తిరుపతి మంగళం డిపోకు చెందిన ఎన్.సి.దొరై(56) 15 సంవత్సరాలకు పైగా తిరుపతి- హైదరాబాద్ ఏసీ సర్వీసును నడుపుతున్నారు. ఎస్.ఆర్.పురం మండలానికి చెందిన దొరై.. 1989లో ఆర్టీసీలో ఉద్యోగం పొంది పుత్తూరు, తిరుపతి డిపోల్లో పనిచేశారు. తిరుపతి డిపోలో డ్రైవర్గా మైసూర్, రామేశ్వరం దూర ప్రాంతాలకు నడిపిన అనుభవం ఉండటంతో మంగళం డిపోలో ఏసీ బస్సులు నడిపే అవకాశం వచ్చింది. తిరుపతి- హైదరాబాద్ మధ్య ఏసీ బస్సులు నడుపుతూ ప్రమాద రహిత డ్రైవర్గా గుర్తింపు పొందారు. ఇదివరకు మూడుసార్లు ప్రమాద రహిత ఉత్తమ డ్రైవర్గా ప్రశంసలు అందుకున్న దొరై.. ఈ ఏడాది జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు.
విధుల్లో ప్రతి డ్రైవర్కు ఓపిక, సహనం ఎంతో ముఖ్యమని, ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని దొరై అభిప్రాయపడ్డారు.
ఘాట్రోడ్డులోనే విధులు
మంగళం డిపోకు చెందిన ఎం.మురళి సర్వీసులో చేరినప్పటి నుంచి ఘాట్ రోడ్డు విధులు నిర్వర్తిస్తున్నారు. 1989లో ఆర్టీసీలో చేరిన ఈయన... తిరుమల డిపోలో 23 ఏళ్లుగా తిరుమల ఘాట్ రోడ్డులో బస్సులు నడుపుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మంగళం డిపోలోనూ అదే ఘాట్ రోడ్డు బస్సులు నడుపుతున్నారు. తన సర్వీసులో చిన్న ప్రమాదానికి తావులేకుండా బస్సులు నడిపి ఉత్తమ డ్రైవర్గా గుర్తింపు పొందారు. ఐదుసార్లు డిపో స్థాయిలో ఉత్తమ డ్రైవర్గా ప్రశంసలు అందుకున్న మురళి... ఈ ఏడాది జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచారు.
ఏకాగ్రతతో ముందుగా వచ్చే ప్రమాదాన్ని పసిగట్టే విధంగా డ్రైవింగ్లో మెలకువతో ఉండాలని మురళి అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434