నేతకు ఉపాధి మేత
గ్రామీణ కుటుంబాలకు గరిష్ఠంగా వందరోజులు పనికల్పించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి.
వేతనాల్లో ఊరూరా వాటాలు
క్షేత్రస్థాయిలో సిబ్బంది దాసోహం
జిల్లాలో పథకం అమలు తీరిది
గూడూరు,గూడూరు గ్రామీణ, న్యూస్టుడే: గ్రామీణ కుటుంబాలకు గరిష్ఠంగా వందరోజులు పనికల్పించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి. చోటా నేతల కనుసన్నల్లో నిధులు జమవుతున్న పరిస్థితి ఊరూరా కనిపిస్తోంది. పనుల్లో పాల్గొననివారికి నగదు జమచేయడంపై ఎక్కడికక్కడ దుమారం రేగుతోంది. ఉద్యోగ భద్రతలేని క్షేత్రస్థాయి సిబ్బంది స్థానిక నేతలకు పూర్తిస్థాయిలో దాసోహం అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఊరికి ఒకరిద్దరు చొప్పున మంత్రాంగం నడిపిస్తూ ప్రతి మండలంలో రూ.లక్షల్లో నిధులు స్వాహా చేస్తున్నట్లు అంచనా.
* జిల్లాలోని కుటుంబాలు 2.76 లక్షలుకాగా 4.78 లక్షల మందికి జాబ్కార్డులు ఉన్నాయి. వీరికి ఏటా రూ.206.99 కోట్లను వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. మొత్తం వ్యయంలో ఇది 64.61%. ఉపాధితోపాటు ఆస్తుల సృష్టికి ఉపకరిస్తోన్న ఈ పథకానికి నాలుగేళ్లుగా స్థానిక నేతలు తూట్లు పొడుస్తున్నారు.
* గూడూరు మండలంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.73 కోట్లు కూలీలకు వెచ్చించారు. రూ.2.17 కోట్లు మెటీరియల్కు వ్యయం చేశారు. ఇదే మండలం రామలింగాపురంలో కూలీలు 419 మంది ఉన్నారు. గతంలో 500 మంది వరకు ఉండగా స్థానికుల ఫిర్యాదుతో పలువురి పేర్లు రద్దు చేశారు. ఇక్కడ ఓనేత రాజకీయ పలుకుబడితో కొందరు పనులకు రాకున్నా నగదు జమచేయిస్తూ స్వాహా చేస్తుండటంపై కూలీలు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఇక్కడ పదుల సంఖ్యలో ఇలాంటివారుండగా రూ.వేలల్లో జమ కావడంపై దుమారం రేగింది.
* ఓజిలి మండలంలో రూ.16 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. కూలీలకు రూ.7.34 కోట్లు, మెటీరియల్ కోసం రూ.8.65 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. సగటూరు తదితర గ్రామాల్లో కొందరు పనులకు రాకున్నా వేతనం జమచేయడంపై ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈతంతు రెండేళ్లుగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. రాజకీయ పలుకుబడిగల కుటుంబంలోని భార్యాభర్తలకు నగదు జమచేస్తున్నట్లు వేతన ఖాతాలను సాక్ష్యంగా చూపుతున్నారు.
* వెంకటగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఇదేతీరు నడుస్తోంది. కూలీల కోసం రూ.6.36 కోట్లు ఏటా వ్యయం చేస్తుండగా పదోవంతు వరకు రాజకీయ పలుకుబడి ఉన్నవారి ఖాతాల్లో పనిచేయకున్నా వేతనం జమచేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, మండలస్థాయి అధికారుల సహకారంతో సాగుతోంది. దీనిపైనా స్థానికులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాగా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.
ఫిర్యాదులపై విచారించి చర్యలు
ఎక్కడైనా కూలీలు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుం టాం. కూలీలకు న్యా యం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తాం.
శ్రీనివాస ప్రసాద్, డ్వామా, పీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్