logo

తిరుపతిలో తెదేపా శ్రేణుల సంబరాలు

రాష్ట్రంలో వైకాపా పతనం మొదలైందని.. ఆ పార్టీని ప్రజలేకాదు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఛీకొడుతున్నారని తెదేపా తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ అన్నారు.

Published : 24 Mar 2023 03:02 IST

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెదేపా సంబరాలు

తిరుపతి(నగరం): రాష్ట్రంలో వైకాపా పతనం మొదలైందని.. ఆ పార్టీని ప్రజలేకాదు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఛీకొడుతున్నారని తెదేపా తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ అన్నారు. పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై గురువారం నగరంలోని పార్లమెంట్‌ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నాయకులు బాణసంచా కాల్చుతూ మిఠాయిలు తినిపించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్‌యాదవ్‌, సింగంశెట్టి సుబ్బరామయ్య, చేజర్ల మనోహరాచారి, రుద్రకోటి సదాశివం, మురళి, రామయాదవ్‌, పెంచలయ్య, నీలమ, కల్పన, నటరాజు తదితరులు పాల్గొన్నారు. ః నగరంలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట గురువారం రాత్రి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. నాయకులు బాణసంచా కాల్చుతూ... తొడకొట్టి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, నాయకులు వి.విజయకుమార్‌, బుల్లెట్‌ రమణ, దంపూరి భాస్కర్‌యాదవ్‌, సుబ్బుయాదవ్‌, ఆనంద్‌గౌడ్‌, ఆముదాల తులసీరామ్‌, ఊట్ల సురేంద్రనాయుడు, పుష్పావతి యాదవ్‌, కరాటే చంద్ర, వేణుగోపాల్‌నాయుడు, విశ్వనాథం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని