logo

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. సికింద్రాబాద్‌ నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు బయలుదేరిన రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతికి సాయంత్రం 3.15 గంటలకు చేరుకుంది.

Published : 01 Apr 2023 03:49 IST

తిరుపతి(రైల్వే), న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. సికింద్రాబాద్‌ నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు బయలుదేరిన రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతికి సాయంత్రం 3.15 గంటలకు చేరుకుంది. ఇక్కడ పరిశీలన అనంతరం తిరిగి సికింద్రాబాద్‌కు అదే మార్గంలో బయలుదేరింది. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో రైలును ఈ నెల 8న ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా   ప్రారంభించనున్నారు. ఆ రోజు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతూ తిరుపతికి చేరుకోనుంది. 9వ తేదీన రైలు షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి కేవలం నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, నల్గొండ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 10వ తేదీన ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు వస్తుంది. ప్రయాణ సమయం 8.30 గంటలుగా నిర్ధారించారు. రైలు నంబర్లు, టికెట్‌ ధర రెండ్రోజుల్లో ద.మ.రైల్వే ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని