అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్ల రాజీనామాలకు అధికారుల అనుమతి తర్వాతే ఆమోదం లభిస్తుందన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ల నుంచి సెల్ఫోన్, సిమ్ కార్డుల స్వాధీనానికి చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై పత్రికలు, ఆన్లైన్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల్ని వేగంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. జేసీ శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ కార్యాలయాల వద్ద జెండాలు తొలగించకుండా చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్వో పుల్లయ్య, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీప్రసన్న, అట్లూరి శ్రీనివాసులు(భాజపా), గంగరాజు(సీపీఎం), భాస్కర్ (కాంగ్రెస్), సురేంద్రకుమార్ (తెదేపా), ఉదయ్కుమార్ (వైకాపా) పాల్గొన్నారు. ః కలెక్టరేట్ ప్రాంగణంలో ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల సభ్యుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు. మే 13న జరిగే పోలింగ్కు పది రోజుల ముందుగా ఈవీఎంలను మరోసారి పరిశీలిస్తామని పేర్కొన్నారు. ః నీటి ఎద్దడి ఉన్న గ్రామాలు గుర్తించి, నీటి సరఫరాకు చేపట్టే చర్యలపై సోమవారానికల్లా నివేదిక ఇవ్వాలని కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ అవసరమైతే నాడు-నేడు పనులు జరిగిన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని బోర్లు వినియో గించాలన్నారు. 250కి పైగా బోర్లు ఉన్న మండలాల్లో మరో మెకానిక్ను నియమించాలని ఆదేశించారు.
ఓటరు నమోదుపై 450 స్వీప్ ర్యాలీలు: జిల్లాలో డ్వామా, పుర/నగరపాలక సంస్థలు, ఐసీడీఎస్, ఆరోగ్యశాఖల సమన్వయంతో ఓటరు చైతన్య కార్యక్రమాలు, ర్యాలీలు 450 జరిగాయి. 2019 ఎన్నికల్లో జిల్లాలో 85.02 శాతం పోలింగ్ నమోదైందని, ఈ విడత దీన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత ఏప్రిల్ 15లోగా ఓటరుగా నమోదవ్వచ్చని, సహాయం కోసం 1950 నంబరుకు డయల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్మశానాలకు సమాధి.. ఆక్రమణలకు పునాది
[ 28-04-2024]
వైకాపా నేతలు ఎన్నికలప్పుడు మాత్రం శ్మశానాలు చూపిస్తామని హామీలు ఇస్తుంటారు.. ఎన్నికల అనంతరం వాటి ఊసే మరుస్తున్నారు.. పైగా స్థలాలు చూపకపోగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. -
ప్రాజెక్టుల పుణ్యం ఎన్టీఆర్దే..!
[ 28-04-2024]
రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను తీసుకురావడం కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైందని హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. -
కుప్పంలో వైకాపా హైడ్రామా..?
[ 28-04-2024]
వైకాపా అడుగడుగునా కోడ్ ఉల్లంఘిస్తున్నా.. అభివృద్ధి పనుల పేరుతో ప్రలోభాలకు తెర తీస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కుప్పం ప్రాంతంలో ఇటీవల కొందరు తెదేపా, జనసేన కార్యకర్తలు వైకాపాలో చేరగా. -
భృతిలేక.. పీఆర్సీ అమలుకాక
[ 28-04-2024]
‘ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంకుస్థాపనలు నమ్మొద్దు అని’ విపక్ష నేతగా చెప్పిన ప్రస్తుత సీఎం జగన్, ఇప్పుడు అచ్చం అవే పనులు చేశారు.. -
భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు
[ 28-04-2024]
వాలంటీర్లను ప్రజాప్రతినిధులు.. ఓ చోట నిర్బంధించి భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు చేయించారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
‘జగన్కు ఆ నలుగురే మిగిలారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం ఎద్దేవా చేశారు. -
‘అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్పాలి’
[ 28-04-2024]
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ప్రజలకు హామీ ఇచ్చారు. -
ఇదేంది జగన్.. ఇలా ముంచేశావ్
[ 28-04-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్సీ కమిషన్ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు.. -
‘హమీ’తుమీ తేల్చవేం జగన్
[ 28-04-2024]
మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. -
సీఎం వస్తున్నారని హడావుడి పనులు
[ 28-04-2024]
త్రిభువని కూడలి వద్ద సీఎం సభ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జనార్దన్రెడ్డి విగ్రహం ముందు భాగంలో కాలువపై బండ పగిలిపోయింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్