logo

‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’

ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్‌ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

Published : 29 Mar 2024 02:44 IST

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్‌ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2019 ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వైకాపా నాయకులు ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమనే అంచనాతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డితో పాటు వైకాపా నాయకులు ఐదేళ్లుగా దోచుకున్న ధనాన్ని కంటైనర్లలో విదేశాలకు తరలిస్తున్నారన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా కొందరు అధికారులు వైకాపా నాయకులకు వత్తాసు పలుకుతున్నారని, నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్‌, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ మేయర్‌ కఠారి హేమలత, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు చంద్రప్రకాష్‌, కోదండయాదవ్‌, మోహన్‌రాజ్‌, త్యాగరాజన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని