రెండో రోజు 16 నామినేషన్లు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు.
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు నామినేషన్ పత్రాన్ని అందిస్తున్న వైకాపా చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప
చిత్తూరు కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. చిత్తూరు ఎంపీ స్థానానికి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. పుంగనూరు అసెంబ్లీకి ఇద్దరు, నగరి ఇద్దరు, జీడీనెల్లూరు ఇద్దరు, పూతలపట్టు ఇద్దరు, పలమనేరు నలుగురు, కుప్పం నియోజకవర్గానికి ఒక నామినేషన్ దాఖలయ్యాయి. రెండో రోజున చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్లు దాఖలు కాలేదు.
ఎంపీ స్థానానికి ఐదు..: చిత్తూరు ఎంపీ స్థానానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్వో షన్మోహన్కు అభ్యర్థులు తమ నామపత్రాల్ని సమర్పించారు. వైకాపా అభ్యర్థిగా రెడ్డెప్ప రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీ వెంట జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు ఉన్నారు. రెడ్డెప్ప సతీమణి రెడ్డెమ్మ సైతం వైకాపా తరఫున రెండు సెట్ల నామినేషన్లు సమర్పించారు. జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి దుగ్గిరాల నాగేశ్వరరావు తన నామినేషన్ అందజేశారు. చిత్తూరు ఎమ్మెల్యే స్థానానికి శుక్రవారం నామినేషన్లు దాఖలు కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాల పెద్దిరెడ్డి, తాయిలాల చెవిరెడ్డి పని పట్టండి
[ 03-05-2024]
రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సైకోలా పట్టిపీడిస్తుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలను పాపాల పెద్దిరెడ్డి హింసిస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
ఎండల్లో ఏడి‘పింఛెను’
[ 03-05-2024]
చిత్తూరు నగరంలోని 8వ డివిజన్ వెంగళరావుకాలనీకి చెందిన వృద్ధుడు రాజారెడ్డి రెండ్రోజులుగా పింఛను కోసం స్థానిక సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. -
ఎంత పని చేశావు జగన్..!
[ 03-05-2024]
ప్రస్తుతం.. సీఎం జగన్.. నియోజకవర్గానికి ఒక స్కిల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆపై జిల్లాకు ఒక స్కిల్ కళాశాల మంజూరు చేసి మమ అనిపించారు. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి నగరాల్లో గతంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లనే స్కిల్ కళాశాలలుగా మార్పు చేసి నిర్వహిస్తున్నారు. -
అరాచకాలను కనిపెట్టేందుకు నిఘా
[ 03-05-2024]
పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా గురువారం పేర్కొన్నారు. -
తెదేపాపై కసి.. శీతల గిడ్డంగిని ఆపేసి
[ 03-05-2024]
పశ్చిమ ప్రాంతంలోని పలమనేరు మార్కెట్ కమిటీ రైతులకు వరం. ఉద్యాన పంటలతో పాటు కూరగాయలు, పూలు, వరి వేరుసెనగ, బంగాళాదుంప తదితర పంటలు పండిస్తారు. -
ఇదేనా జగన్ చి(చె)త్త శుద్ధి..!
[ 03-05-2024]
జగన్ సర్కారు నిర్లక్ష్యం పుణ్యమా.. అని జిల్లాలో స్వచ్ఛ సంకల్పం ఆచరణలో నీరుగారిపోయింది. స్వచ్ఛభారత్ నినాదంతో గ్రామాల్లో పారిశుద్ధ్యమే లక్ష్యంగా ప్రభుత్వం వెచ్చించిన రూ. కోట్ల నిధులకు ప్రయోజనం లేకుండా పోయింది. -
నయవంచక నాయకా...!
[ 03-05-2024]
నగరి మండలం తడుకుపేటలో 200 ఇళ్లను ఆప్షన్-3 కింద నిర్మిస్తున్నారు. కొన్ని ఇళ్ల పనులు పైకప్పు వరకు వచ్చాయి. ఆపై అవి అక్కడితో నిలిచిపోయాయి. -
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నేతలు
[ 03-05-2024]
చంద్రగిరి పర్యటనకు వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్.రాజన్, మాజీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి గురజాల సందీప్ ఆధ్వర్యంలో పలువురు వైకాపా నాయకులు గురువారం తెదేపా కండువా కప్పుకొన్నారు. -
వాలంటీరు ప్రచారాన్ని అడ్డుకున్న తెదేపా
[ 03-05-2024]
ఓ మహిళా వాలంటీరు వైకాపా తరఫున చేస్తున్న ప్రచారాన్ని స్థానిక తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకులు తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. -
వైకాపా నేతలకు స్లిప్పులు
[ 03-05-2024]
తిరుపతి 22వ డివిజన్ 266 పోలింగ్ కేంద్రం పరిధిలో బీఎల్వో గోపీకృష్ణ ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేస్తూ.. ఓటరు సంతకంతోపాటు ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. -
ఇళ్లు కాదు.. అబద్ధాలు కళ్లకు కట్టారు
[ 03-05-2024]
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహాలు మంజూరు చేసి.. ఒక్కో గృహానికి రూ.1.80 లక్షలు కేటాయించారు. ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని గొప్పగా ప్రకటించారు సీఎం జగన్. -
‘జగన్ 30 స్థానాలకు పడిపోవడం ఖాయం’
[ 03-05-2024]
జగన్ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, శాసనసభ ఎన్నికల్లో వైకాపా 30 స్థానాలకు పడిపోవడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ స్పష్టం చేశారు