ఓరిమితోనే..భవితకు చోటు
‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్రాయుధం.. ఓటు. ఈ హక్కు పొందడంలో నిర్లిప్తత నెలకొంది. ఎన్నికల రోజు హడావుడిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి.. జాబితా చూసుకుని.. పేరు లేకపోతే..
జాతీయ ఓటర్ల దినోత్సవం నేడు
‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్రాయుధం.. ఓటు. ఈ హక్కు పొందడంలో నిర్లిప్తత నెలకొంది. ఎన్నికల రోజు హడావుడిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి.. జాబితా చూసుకుని.. పేరు లేకపోతే.. నా ఓటు లేకుండా చేశారు... ఉద్దేశపూర్వకంగా తొలగించారని నిందించడమే తప్ప... అసలు నా ఓటుందా? లేదా? లేకుంటే ఏం చేయాలి? అని ముందు జాగ్రత్త తీసుకునే వారు తక్కువ. ఒకసారి ఓటేస్తే అయిదేళ్లు పాలితులమవుతామనే సత్యాన్ని తెలుసుకోకుండా ఓటు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.’’
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్: ‘‘యువతకు ఓటు హక్కే లక్ష్యంగా.. ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందుకే నేడు ఓటర్ల జాబితా చూసుకోవాలి. అర్హత ఉండి మీ పేరు లేకపోతే మళ్లీ నమోదు చేసుకోవాలి. రండి.. పోయేదేముంది.. ఒక గంట సమయమేగా. రెవెన్యూ కార్యాలయాల గడప తొక్కకుండానే... చరవాణి నుంచే ఓటు నమోదుకూ వీలుంది. ఓరిమితో ఓటరుగా నమోదై.. ఓటుపథాన నడవాలి.. చైతన్యంతో మసలుకోవాలి. బంగారు భవితకు బాటలు వేయాలి.
యువతీ యువకులకు ఓటు నమోదుపై అవగాహన
రండి... సరిచూసుకోండి
ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాల్లో 4,643 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఈనెల 5న ప్రచురించిన ఓటర్ల తుది జాబితాలు అందుబాటులో ఉండనున్నాయి. కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దారు, మున్సిపల్ కార్యాలయాలు, బూత్ లెవల్ అధికారుల వద్ద కూడా జాబితాలు ఉన్నాయి. వీటిని ఎప్పుడైనా పరిశీలించవచ్చు.nvsp.in వెబ్సైట్, voter help line’ యాప్లో ఆన్లైన్లో ఓటర్ల జాబితా చూడవచ్చు. 1950 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించి.. మీ పేరు, ఊరు, ఇంటి నంబరు, చిరునామా, ఓటరు గుర్తింపు సంఖ్య తెలియజేస్తే, మీ ఓటు ఉందో లేదో తెలుస్తుంది.
నిరంతర ప్రక్రియ
ఓటు నమోదు నిరంతర ప్రక్రియ. 18 ఏళ్లు నిండితే ఎప్పుడైనా ఓటరుగా నమోదు కావచ్చు. ఏటా జనవరి 1, జులై 1, అక్టోబరు 1.. ఇలా ఈ 3 నెలల చివరకు 18 ఏళ్లు నిండితే ఆన్లైన్, ఆఫ్లైన్లో ఓటరుగా నమోదు కావచ్చు. తహసీల్దారు కార్యాలయ ఎన్నికల విభాగాల్లో ఫారం-6 ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటు ఉంటే.. చేర్పులు, మార్పులు, బదిలీ, తొలగింపు దరఖాస్తు ఇవ్వవచ్చు. nvsp.in వెబ్సైట్,voter help line’ యాప్లోనూ దరఖాస్తు చేయవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు విచారించి.. ఓటు హక్కు కల్పిస్తారు. కొత్తగా ఓటు హక్కు కోరే వారు పాస్పోర్టు సైజ్ ఫొటో, వయసు ధ్రువీకరణ, ఆధార్కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి.
నిర్లిప్తత వీడండోయ్
ఓటర్ల జాబితాలో 18-19 ఏళ్లవారు 4 శాతం ఉండాలి. మూడు జిల్లాల్లోనూ ఒక శాతానికి మించి నమోదు కాలేదు. కాకినాడ జిల్లా ఓటర్లలో 18-19 ఏళ్ల వారు 50 వేలకు పైగా ఉండాలి. కానీ ఉన్నది 14,800 మందే. తూర్పుగోదావరి జిల్లాలో 45 వేల మందిని గుర్తించినా 13,967 మందే ఓటర్లుగా ఉన్నారు. కోనసీమ పరిధిలో 40 వేల మంది ఉంటే.. ఓటర్లుగా 60 శాతం లోపే ఉన్నారు. మిగిలిన వారినీ ఓటర్లుగా చేర్పించాల్సిన తరుణమిదే.
పోలింగ్కూ వెనకబాటే
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019లో సార్వత్రిక ఎన్నికల్లో 80.20 శాతం మందే ఓటేశారు. రాజానగరంలో అత్యధికంగా 87.51 శాతం, అత్యల్పంగా రాజమహేంద్రవరం నగరంలో
66.34 శాతం పోలింగ్ నమోదైంది.
నిర్ణయించేది నువ్వే!
ఈనాడు, కాకినాడ: ఎవరు నెగ్గాలో.. ఎవరు ఓడాలో.. తేల్చేది ఓటరే. ఎలాంటి వారు ఏలాలో నిర్ణయించేది ఓటరే.. నాకు ఓటు లేకపోతే.. నేనొక్కడినే ఓటు వెయ్యకపోతే ఏమవుతుందిలే.. అనేది చాలామంది భావన కానీ.. పూర్వ ఎన్నికల తీరు పరిశీలిస్తే.. 1, 2, 3, 4, 5.. ఇలా అంకెల తేడాతో విజయం తారుమారయ్యే పరిస్థితి నెలకొంది. ఓట్ల లెక్కింపులో చివరి క్షణం వరకు విజయం దోబూచులాడింది. ఓటు.. ఓటరు నిర్ణయం ఎంత కీలకమో తేలింది. గత పంచాయతీ, పరిషత్తు, పుర ఎన్నికల్లో ఉత్కంఠ రేపే ఫలితాలు తారసపడ్డాయి.
పంచాయతీ ఎన్నికల్లో..
గొల్లప్రోలు మండలం వన్నెపూడి పంచాయతీ ఎన్నికల్లో రాసంశెట్టి వెంకటలక్ష్మి, కొడవలిలో జోడా శ్రీను ఒక్క ఓటు మెజార్టీతో వార్డు
సభ్యులుగా గెలిచారు. రౌతులపూడి మండలం ధారజగన్నాథపురంలో మిరియాల జోగిరాజు.. జగ్గంపేట మండలం గోవింద
పురంలో కమ్మిల వెంకటేశ్వరరావు మూడు ఓట్లతో గెలిచారు. రౌతులపూడి మండలం రాఘవపట్నంలో రాయిపల్లి లోవరాజు 5 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
గొల్లప్రోలు మండలం కొడవలి ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థి బుద్ధా భగవాన్ ఒకటే ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు.
జగ్గంపేట మండలం రామవరం- 2 ఎంపీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి దొడ్డా శ్రీను రెండు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
పరిషత్తు పోరులో..
ప్రత్తిపాడు మండలం ఏలూరు-1లో వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాణి మూడు ఓట్ల మెజార్టీతో నెగ్గారు.
కరప మండలం సిరిపురం స్థానంలో జనసేన అభ్యర్థి కత్తుల ధనలక్ష్మి నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచారు.
పుర సమరంలో..
రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డు అభ్యర్థిని పెంటపాటి దేవి నాలుగు ఓట్ల తేడాతో గెలిచారు.
రామచంద్రపురం ఒకటో వార్డు నుంచి పోటీచేసిన తెదేపా అభ్యర్థి పైడిమళ్ల సత్తిబాబు 5 ఓట్ల తేడాతో గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.