డ్రోన్లు వస్తున్నాయ్..
కాకినాడ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో డ్రోన్ల వ్యవస్థ తీసుకురానున్నారు. వరి, ఇతర పంటలకు పురుగు మందుల పిచికారీకి వీటిని వినియోగించనున్నారు.
వరిచేలో డ్రోనుతో పురుగు మందు పిచికారీ
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: కాకినాడ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో డ్రోన్ల వ్యవస్థ తీసుకురానున్నారు. వరి, ఇతర పంటలకు పురుగు మందుల పిచికారీకి వీటిని వినియోగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కిసాన్ డ్రోన్లను ప్రవేశపెట్టాలని ఆదేశాలిచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కిసాన్ డ్రోను కస్టమ్ హైరింగ్ కేంద్రాలు నెలకొల్పనున్నారు. ఇప్పటికే వ్యవసాయ యాంత్రీకరణ పరకరాలతో కస్టమ్ హైరింగ్ సెంటర్లను రైతు బృందాలు నిర్వహిస్తున్నాయి. పురుగు మందులు, జింకు సల్ఫేట్ వంటి సూక్ష్మ పోషకాలు, ద్రవ రూపంలో ఉన్న యూరియాను సకాలంలో డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తారు. దీంతో సేద్యం ఖర్చు తగ్గించడం, రైతు ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టడానికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. దీనికోసం కాకినాడ జిల్లాలోని 20 మండలాల్లో ఒక్కో మండలంలో మూడు చొప్పన రైతు బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృందంలో అయిదుగురు రైతులు ఉండేలా చూస్తున్నారు. వీరిలో ఒకరు కచ్చితంగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, పైచదువులు పూర్తి చేసి ఉండాలి. మొత్తం 60 బృందాలు లక్ష్యం కాగా, ఇప్పటికి 46 నెలకొల్పారు. వీరికి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే యు.కొత్తపల్లి మండలం నుంచి ఒకరు, పిఠాపురం మండలం నుంచి ఇద్దరు శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణకు ప్రైవేటుగా రూ.45వేల వరకు ఖర్చు అవుతుండగా, రైతులకు ఉచితంగా ఇస్తున్నారు. ఒక్కో రైతుకి రూ.17వేలు చొప్పున ప్రభుత్వం వెచ్చిస్తోంది.
40 శాతం రాయితీ
రైతు బృందాలకు రాయితీ ద్వారా డ్రోన్లను సరఫరా చేయనున్నారు. గరిష్ఠంగా ఒక్కో డ్రోనుకు రూ.10లక్షలు ఖర్చవుతుందని అంచనా. దీనిలో 40 శాతం రాయితీ, 10 శాతం రైతు బృందం వాటా, 50 శాతం డీసీసీబీ ద్వారా రుణం కల్పించే విధంగా యూనిట్ను రూపకల్పన చేశారు. రైతు బృందంలో అగ్రికల్చరల్ బీఎస్సీ, వ్యవసాయ రంగ కోర్సులు పూర్తి చేసిన వారుంటే రాయితీని 50 శాతం కల్పించనున్నారు. కిసాన్ డ్రోన్ కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా ఇతర రైతులకు అద్దె ప్రాతిపదికన డోన్లను సరఫరా చేసేలా మార్గదర్శకాలు రూపొందించారు.
పాస్పోర్టు మెలిక
రైతు బృందంలో ఉన్న సభ్యులకు విధిగా పాస్పోర్టు ఉండాలనే మెలిక పెట్టారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన బృందాల్లో అతి తక్కువ మందికే పాస్పోర్టులు ఉన్నాయి. మిగతా వారిలో పాస్పోర్టులకు దరఖాస్తు చేయిస్తున్నారు. భారత పౌరుడిగా గుర్తింపునకు ఈ విధానం అమలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రతీ బృందంలో ఒకరు విద్యావంతుడై ఉండే, అతడిని కిసాన్ డ్రోన్ పైలెట్గా శిక్షణ ఇస్తున్నారు. పాస్పోర్టు నిబంధనలతో శిక్షణకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీలైనంత త్వరగా వీటిని సాకారం చేస్తేనే కిసాన్ డ్రోన్ పథకం విజయవంతం అయ్యే అవకాశం ఉంది.
ఎంతో ఉపయోగం
ఎన్.విజయ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, కాకినాడ జిల్లా
జిల్లాలో 2లక్షల ఎకరాల వరకు వరి, ఇతర వ్యవసాయ, అనుబంధ పంటల సాగు జరుగుతోంది. పంట వేసిన తరువాత తెగుళ్ల నుంచి కాపాడుకోటానికి రైతులు పురుగు మందులు, సూక్ష్మపోషకాలను స్ప్రేయర్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. దీంతో ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడానికి డ్రోన్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. 20 మండలాల పరిధిలో 60 రైతు బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. వీరిలో కొందరిని డ్రోన్ పైలెట్గా ఎంపిక చేసి, శిక్షణకు పంపుతున్నాం. పాస్పోర్టుల విషయంలో రైతులకు పూర్తి సహకారం అందిస్తున్నాం. త్వరలో డ్రోన్ల ద్వారా పురుగు మందుల పిచికారీ వ్యవస్థను జిల్లాలో ప్రవేశపెడతాం. ఇప్పటికే ట్రయల్ రన్ చేశాం. దశల వారీగా అన్ని గ్రామాలకు దీన్ని విస్తరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం