స్నేహితుడ్ని కలిసేందుకు వచ్చి కాలు కోల్పోయి..
కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి రైలు ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయిన ఘటనలో హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతానికి చెందిన గూడవరపు సువర్ణ
సాంబమూర్తినగర్ (కాకినాడ): కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి రైలు ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయిన ఘటనలో హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతానికి చెందిన గూడవరపు సువర్ణ (22) తీవ్రంగా గాయపడిన విషయం విదితమే.. ఈ ఘటనలో ఆ యువతి ఎడమ కాలు కోల్పోయింది. ఆమె తండ్రి దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం మండలం రాజభూపాలపట్నానికి చెందిన దుర్గాప్రసాద్ కుటుంబం చాలాకాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటోంది. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె సువర్ణ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్లో సామర్లకోట వచ్చి స్వగ్రామంలోని బంధువులు, స్నేహితుడ్ని కలిసింది. తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు గౌతమి ఎక్స్ప్రెస్లో వెళ్లేక్రమంలో ప్రమాదానికి గురైంది. జీజీహెచ్ ఎమర్జన్సీ వార్డులో చికిత్స పొందుతున్న ఆమెను ఐసీయూలోకి తరలించారు. ఎడమ కాలిలో ఎముకలు నలిగిపోవడంతో సోమవారం సాయంత్రం వైద్యులు శస్త్రచికిత్స చేసి కాలు తొలగించారన్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని యువతి తండ్రి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్పై విజయం
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను