అసంపూర్తి నిర్మాణం.. ఆపేయాలని ఆదేశం..!
రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతుభరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, బల్క్మిల్క్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టింది.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
బోడసకుర్రులో అసంపూర్తిగా సచివాలయ భవనం
రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతుభరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, బల్క్మిల్క్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టింది. వీటిలో గ్రామ సచివాలయానికి రూ.40 లక్షలు, ఆర్బీకేకు రూ.21.80 లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రాలకు రూ.17.50 లక్షలు చొప్పున కేటాయించింది. గుత్తేదారులు నిర్మాణాలు చేపట్టారు. కొన్నిచోట్ల అధికారులు గుత్తేదారులను బతిమాలి పనులు అప్పగించారు. ఇప్పటివరకు ఉన్నతాధికారులు ప్రభుత్వ భవనాలపై సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి వాటి ద్వారా ప్రజలకు సేవలు దగ్గరచేయాలని చెప్పేవారు. తాజాగా పూర్తికాని వాటిని నిలిపివేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలియడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకీ నిర్ణయం..
జిల్లావ్యాప్తంగా మొదలు పెట్టని, పునాది దశ దాటని నిర్మాణాలను నిలిపివేయాలని పంచాయతీరాజ్శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలందాయి. దీంతో వారు మండలాలవారీగా నిర్మాణాల పురోగతిపై నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. భవనాలన్నింటికీ పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేకనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని గుత్తేదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరంభం నుంచీ స్థల సేకరణ, బిల్లుల మంజూరులో జాప్యంతోనే నిర్మాణాలు పూర్తికాని పరిస్థితి తలెత్తిందని గుత్తేదారులు అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి బిల్లుల పరిస్థితేంటని వాపోతున్నారు.
అద్దె భవనాలే దిక్కు..
పాలన స్వరూపాన్నే మార్చేస్తామని, సేవలన్నింటినీ ప్రజల వద్దకే చేరుస్తామని చెప్పిన ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్మాణాల నిలిపివేత నిర్ణయం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పాత భవనాలు తొలగించినచోట్ల తాత్కాలికంగా అద్దె భవనాల్లో పలు శాఖల అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. తాజా ఆదేశాలతో అద్దె భవనాలే దిక్కయ్యేలా ఉన్నాయని అధికారులు వాపోతున్నారు. కొన్నిచోట్ల ఆర్బీకే, వెల్నెస్ సెంటర్లకు అద్దెలు చెల్లించక యజమానులు తాళాలువేసిన ఘటనలు ఉండడం గమనార్హం.
పునాదుల్లో 290 భవనాలు
జిల్లావ్యాప్తంగా సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు మొత్తం 1,110 భవనాలు నిర్మించాలని పనులు ప్రారంభించారు. వీటిలో 290 భవనాలు పునాది దశ దాటలేదు. పనులు నిలిచాయి. డిజిటల్ గ్రంథాలయాలు, బల్్్కమిల్క్ సెంటర్ల నిర్మాణం ఇప్పటికీ మొదలు పెట్టనేలేదు.
మార్చి నాటికి పూర్తి చేస్తాం
పంచాయతీల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పునాది దశకే పరిమితం కావడంతో నిలిపివేయాలని ఆదేశాలందాయి. మిగిలిన భవనాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
చంటిబాబు, ఎస్ఈ, పంచాయతీరాజ్ శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.