అమ్మఒడి సాయం.. ‘అయోమయం!’
‘అల్లవరం మండలానికి చెందిన ఓ గృహస్థుడికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అమలాపురంలోని ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మూడేళ్లుగా అతడికి అమ్మఒడి లబ్ధి అందింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్ : ‘అల్లవరం మండలానికి చెందిన ఓ గృహస్థుడికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అమలాపురంలోని ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మూడేళ్లుగా అతడికి అమ్మఒడి లబ్ధి అందింది. ఈ ఏడాది కొత్తగా మరో కొడుకు ఒకటో తరగతి పూర్తి చేయడంతో అమ్మఒడి జాబితాలో అతడి పేరుందని తల్లితో వాలంటీరు ఈ కేవైసీ పూర్తిచేశారు. పెద్ద కొడుక్కి అమ్మఒడి వస్తోందని, చిన్నకొడుకు చదివే పాఠశాలలో బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఇద్దరికీ అందలేదు. ఇది కేవలం ఈ కుటుంబ పరిస్థితి మాత్రమేకాదు. జిల్లావ్యాప్తంగా అనేక మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు అమ్మఒడి సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. అసలు తమ పిల్లల పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయో, లేవో కూడా తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
ఇప్పటికీ జమకాని నిధులు
అమ్మఒడి నాలుగో విడత లబ్ధి పంపిణీని గత నెల 28న కురుపాంలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. బటన్ నొక్కిన వెంటనే ఖాతాల్లో నగదు జమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అదేరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా 1,38,833 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.13 వేల చొప్పున రూ.180.48 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. ఇప్పటివరకు చాలామంది తల్లుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. వారంతా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా అధికారులు స్పష్టంగా అర్హులెందరనేది పేర్లతోసహా వెల్లడించలేదు.
వివరాలు వెల్లడించేదెన్నడో..?
అనర్హుల వివరాలను వెల్లడిస్తే.. లోటుపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు చెప్పడం లేదు. దీంతో తాము పథకానికి అర్హత సాధించామో, లేదో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలులో భాగంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధికి అర్హులను ఆర్నెళ్లకోసారి సమీక్షిస్తుంది. తొలి దశలో అనర్హులైనవారు ఆరు నెలల తరువాత అర్హత సాధిస్తే ఆయా పథకాల లబ్ధి అందిస్తున్నారు. అమ్మఒడి విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించట్లేదు. గత మూడు విడతలు పరిశీలిస్తే మొదట జాబితాలో ఉన్నవారికి మాత్రమే లబ్ధి దక్కుతోంది. ఆరు నెలల తరువాత అర్హత నిరూపించుకున్నా.. డబ్బు అందని పరిస్థితి. గతేడాది లబ్ధి పొందినవారిలో ఆరంచెల పరిశీలన దాటి ఎందరు అర్హులయ్యారో సంఖ్య మాత్రమే అధికారులు చెప్పారు.. వారి వివరాలు మాత్రం ఇవ్వడం లేదు. అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శనతోపాటు కొత్తగా వచ్చిన దరఖాస్తులపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కొత్తగా అర్హులనుంచి దరఖాస్తులు స్వీకరించడం లేదు. దీంతో తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది.
సచివాలయాల్లో కానరాని జాబితా
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వనుంచి లబ్ధిదారులకు అందుతున్న ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ విడత అమ్మఒడికి సంబంధించిన జాబితా ఇప్పటివరకు ఏ సచివాలయంలోనూ బహిరంగపరచలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి తమకు అమ్మఒడి అందలేదని, అసలు ఈకేవైసీకి వాలంటీరు రాలేదని ప్రధానోపాధ్యాయులను అడుగుతుంటే అమ్మఒడి లబ్ధిపై తమకు ఏ విధమైన సమాచారం లేదని, సచివాలయాలకు వెళ్లాలని చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. తీరా అక్కడికి వెళ్లిచూస్తే నోటీసు బోర్డుల్లో అర్హుల జాబితా ప్రదర్శించడం లేదు. గతేడాది లబ్ధి పొందితే ఈ ఏడాది కూడా డబ్బులొస్తాయి.. కాస్త ఓపికపట్టండంటూ సచివాలయ ఉద్యోగులు అంటున్నారని, కనీసం జాబితాలో తమ పిల్లల పేరుందో, లేదో చెప్పడం లేదని తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్హులందరికీ అందుతాయి..
ప్రస్తుతం నాలుగో విడత అమ్మఒడి సొమ్మును ప్రాధాన్య క్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ అందుతాయి. అర్హత వివరాలు ఇతర శాఖల నుంచి విద్యాశాఖ అధికారులకు వస్తాయి. వీరి జాబితా ప్రదర్శన విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం.
కమలకుమారి, జిల్లా విద్యాశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ