logo

Janasena: అభిమానం తగ్గేదేలే.. వివాహ వేదికపై జనసేన కండువాలతో..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై నూతన వధువరులు అభిమానాన్ని చాటుకున్న వైనం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

Updated : 06 Sep 2023 09:41 IST

రామచంద్రపురం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై నూతన వధువరులు అభిమానాన్ని చాటుకున్న వైనం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. వివాహ వేదికపై పార్టీ కండువాలు వేసుకుని తగ్గేదెలే అంటూ స్టిల్‌ను ఇవ్వడం జనసేన అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ నెల 3వ తేదీ రాత్రి 9..44 గంటలకు రంగంపేట మండలం దొడ్డిగుంటకు చెందిన ఇనకోటి రాజా, రామచంద్రపురం మండలం ఎరుపల్లికి చెందిన హేమభరణితో దొడ్డిగుంటలో వివాహం జరిగింది. ఆహ్వాన పత్రికపై ఓ వైపు వివాహ వేడుక వివరాలు, మరో పక్క పవన్‌కల్యాణ్‌ ఫొటోతోపాటు జనసేన ప్రీ మేనిఫెస్టోని ప్రచురించడం అందరినీ ఆకర్షించింది. ఈ వివాహానికి జనసేన స్థానిక నాయకులు హాజరై వధూవరులను దీవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని