గురుకులాల్లో హాజరు.. అరకొర
సంక్రాంతి సెలవుల అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 2,026 మంది ఆయా గురుకులాలకు వచ్చారు. 2021-22 విద్యా ఏడాదిలో 18 గురుకులాల్లో మొత్తం 9,176 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
వినుకొండ గురుకులంలో విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న సిబ్బంది
గుంటూరు, న్యూస్టుడే సంక్రాంతి సెలవుల అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 2,026 మంది ఆయా గురుకులాలకు వచ్చారు. 2021-22 విద్యా ఏడాదిలో 18 గురుకులాల్లో మొత్తం 9,176 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. సంక్రాంతి సెలవుల అనంతరం గురుకులాల్లో తరగతులకు హాజరైన వారి సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. ఒమిక్రాన్ కేసులు విస్తరిస్తుండటంతో పిల్లల్ని గురుకులాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తుందనే ప్రచారం జరగడంతో వేచి చూసే ధోరణిలో పలువురు తల్లిదండ్రులు ఉన్నారు. ఆయా గురుకులాల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను తరగతులకు తీసుకురావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం లేదు. కొవిడ్ మూడో దశలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువ నమోదు అవుతుండడంతో భయాందోళన చెందుతున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినపుడే విద్యార్థులను పిలిపించాలనే భావనలో ఉన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత కూడా కొందరు గురుకులాలకు వస్తున్నారని సిబ్బంది తెలిపారు. గురుకులాల్లో భౌతిక దూరం పాటించేలా చూడడం, మాస్కులు పెట్టుకోవడం, శానిటేషన్ రాసుకునేలా చూడడం ఉపాధ్యాయులకు సవాల్గా మారింది. చిన్న తరగతుల విద్యార్థులకు కరోనా గురించి అవగాహన లేకపోవడంతో కొవిడ్ నిబంధనలు పాటించని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధించడం.. స్టడీ అవర్స్లో జాగ్రత్తలు తీసుకోవడం సమస్యగా మారింది. ఎక్కడ కొవిడ్ బారిన పడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. కొవిడ్-1, 2 దశల్లో కొందరు ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొని ఉండటమే వారి భయానికి కారణంగా మారింది.
విద్యాలయాల వారీగా..
కారంపూడిలో 429 మంది విద్యార్థులకు 33 మంది విద్యార్థులు హాజరయ్యారు. రామకృష్ణాపురం 651-70, అచ్చంపేటలో 537-142, చుండూరులో 449-65, వి.పి.సౌత్లో 737-33, బాపట్లలో 647-131, వినుకొండలో 473-418, నిజాంపట్నంలో 430-29, రేపల్లెలో 614-22, ఉప్పలపాడులో 621-100, అమరావతిలో 777-201, కాకుమానులో 406-118, తాడికొండలో 373-88, గురజాలలో 413-125, సత్తెనపల్లిలో 369-45, అడవితక్కెళ్లపాడులో 665-146, యడ్లపాడులో 365-181, నరసాయపాలెంలో 220 మందికి 79 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించిన గుంటూరు.. చంద్రబాబుకు అభిమాన నీరాజనం
[ 02-05-2024]
‘గుంటూరు మిరప ఘాటు ఎలా ఉంటుందో సత్తా చూపారు. ర్యాలీ అదుర్స్’ అని రోడ్షోలో భారీగా స్వాగతం పలికిన, సభకు హాజరైన జనాన్ని చూసి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఇలా స్పందించారు. -
పాలకుల పాపాలు.. సమిధలయ్యె ప్రాణాలు
[ 02-05-2024]
రక్షితనీరు.. ప్రజల ప్రాథమిక అవసరం.. కానీ జగన్ పాలనలో దీన్ని పూర్తిగా విస్మరించారు. తాగు నీటి సరఫరా, నిర్వహణపై అధికారులతో ఎప్పుడూ సమీక్షించింది లేదు. -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
[ 02-05-2024]
న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలల గృహం.. కల్లోలం
[ 02-05-2024]
అర్హులైన ప్రతి పేదకు ఇంటి స్థలంతో పాటు గృహాన్ని నిర్మించి ఇచ్చే బాధ్యత మాది. మీరు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తాం. -
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
[ 02-05-2024]
‘అమరావతి అంటే ఏంటి..అది ఎక్కడ ఉంది’ అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతలు.. ‘మేత’లు
[ 02-05-2024]
జేపీ కంపెనీ ఇసుక తవ్వకాల నుంచి తప్పుకున్న తర్వాత ఇసుక వ్యాపారాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి చేజిక్కించుకున్నారు. -
కోడ్ ఉల్లంఘనపై 60 కేసులు
[ 02-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 60 కేసులు నమోదు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
చంద్రబాబును గెలిపించండి
[ 02-05-2024]
రాజధానిని నిర్మించే నాయకుడు చంద్రబాబును గెలిపించాలని అమరావతి రాజధాని రైతులు మంగళగిరి కొత్తపేటలో బుధవారం సాయంత్రం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. -
యువకుల ప్రాణాలు కాపాడిన బీచ్ పోలీసులు
[ 02-05-2024]
సూర్యలంక తీరంలో విహారానికి వచ్చి సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న మంగళగిరికి చెందిన ఇద్దరు యువకుల ప్రాణాలను బీచ్ పోలీసులు బుధవారం కాపాడారు. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీ వలసలు
[ 02-05-2024]
తెనాలిలో వైకాపా నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వాసు దంపతులు, -
ప్రాణాలు పోతున్నా పట్టదా..!
[ 02-05-2024]
వైౖకాపా పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై ‘నాకింత.. -
స్వచ్ఛమైన నీరు ఎక్కడ.. కిలారి
[ 02-05-2024]
పుర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అనేక సందర్భాల్లో వేదికలపై నుంచి చెప్పారు. -
అవకాశవాదులను తెదేపాలో చేర్చుకోం
[ 02-05-2024]
-
జీఎంసీకి రూ.5 లక్షల జరిమానా
[ 02-05-2024]
గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ప్రస్తుతం ఉన్న 250 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా తగినంత మంది బోధనానిపుణులు, ఇతర సదుపాయాలు లేనందున రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) అధికారులు ఆదేశించారు. -
పోస్టల్ బ్యాలట్ల దరఖాస్తులు తీసుకోవడానికి నిరాకరణ
[ 02-05-2024]
బాపట్ల జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన ఒప్పంద ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ తీసుకోవడానికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని తహసీల్దార్లు నిరాకరించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.