10 నెలలుగా జీతాల్లేవు!
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఆ ఉద్యోగులు లేకుండా రోగులకు వైద్యసేవలు అందవనడంలో అతిశయోక్తిలేదు. రక్త పరీక్షల నుంచి ఈసీజీ తీసే వరకు అన్నింటా వీరే ముందుంటారు.
జీజీహెచ్లో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల అవస్థలు
ఈనాడు, అమరావతి
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఆ ఉద్యోగులు లేకుండా రోగులకు వైద్యసేవలు అందవనడంలో అతిశయోక్తిలేదు. రక్త పరీక్షల నుంచి ఈసీజీ తీసే వరకు అన్నింటా వీరే ముందుంటారు. వైద్యసేవలు అందించడంలో ఇంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారికి జీతాలు ఇవ్వడానికి మాత్రం అధికారులకు చేతులు రావటం లేదు. నిత్యం కొన్ని వందల మందికి ఆయా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్సరే టెక్నీషియన్లు, ఈసీజీ టెక్నీషియన్లు, నర్సులు, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, ఫార్మాసిస్టులు ఇలా పలు రకాల ఉద్యోగులు ఉన్నారు. ఎవరైనా రోగికి సహాయకులు లేకుండా ఒంటరిగా వస్తే వారిని వార్డుల్లో చేర్పించి సపర్యలు చేసేది కూడా వీరే. మొత్తంగా వీరు ఆస్పత్రిలో రోగులకు పలు రకాలుగా సాయపడతారు. ఎంతో కీలకమైన విధులు నిర్వహించే ఈ చిరుద్యోగులకు నెలవారీ కాకపోయినా కనీసం మూడు నెలలకు ఒకసారైనా జీతమిస్తే తమకు ఎంతో కొంత ఊరట కలుగుతుందని సంబంధిత ఉద్యోగులు వేడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు ఇన్నాళ్లు జీతాలు ఆపిన పరిస్థితి లేదని, జగన్ సర్కార్ వచ్చాక తమ వెతల గురించి పట్టించుకునే నాథుల్లేరని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 10 నెలల పాటు జీతమివ్వకుండా పనిచేయమనడం ఏ మేరకు సమంజసమో ఉన్నతాధికారులే గుర్తించాలి. వీరిలో కొందరు భార్యాభర్తలు ఆస్పత్రిలోనే పనిచేస్తున్నారు. ఇద్దరికీ జీతం ఇన్నాళ్ల పాటు పెండింగ్ పడితే వారు నెలవారీ అద్దె, ఇతర ఇంటి వ్యయాలు ఎలా సమకూర్చుకుంటారో ఆలోచించుకోవాలి.
15-20 ఏళ్ల నుంచి..
సుమారు 200 మందికి పైగా ఆరోగ్యశ్రీ కింద నియామకమై గత 20 ఏళ్లు నుంచి పని చేస్తున్నారు. ఎక్కువ మందికి 10-12 ఏళ్ల సర్వీస్ ఉంటుంది. ఇన్నాళ్ల నుంచి ఇక్కడే పనిచేయడంతో వారు ఇతర ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారు.. అలా అని తమకు జీతం ఇవ్వకుండా నెలలు తరబడి పెండింగ్ పెడితే ఎలా బతకాలని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. తామిప్పుడు బయటకు వెళితే అనుభవం పోతుందని, తిరిగి తమను బయట జూనియర్లుగానే భావిస్తారని జీతాల చెల్లింపులో జాప్యం జరిగినా కొందరు బయటకు వెళ్లలేకపోతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చాలా వరకు ఆరోగ్యశ్రీ కిందే సేవలు అందిస్తున్నారు. నెలకు సగటున వందల సంఖ్యలో శస్త్రచికిత్సలు చేస్తున్నారు. రోజుకు అన్ని రకాల పరీక్షలు కలిపి సుమారు వెయ్యి నుంచి 1200 మందికి చేస్తారు. ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో ఆస్పత్రికి జమవుతున్నాయి. కానీ ఆరోగ్యశ్రీ కింద నియామకమైన పారామెడికల్ స్టాఫ్కు నెలలు తరబడి జీతాలు చెల్లించకుండా మీనమేషాలు లెక్కించటం ఆస్పత్రి తీరుగా మారింది. రెగ్యులర్ ఉద్యోగులకు ఒక నెల జీతం నాలుగైదు రోజులు ఆలస్యమైతేనే పాలు, కేబుల్, అద్దె, నిత్యావసరాలకు చెల్లింపులు ఎలా చేయాలని ఆందోళన చెందుతున్నారు. కానీ వీరికి మాత్రం 10 నెలలకు పైగా జీతాలు పెండింగ్ పడ్డాయి. ఇప్పటికైనా వీరికి జీతాల సమస్య లేకుండా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఇలాకాలోనే ఇన్నాళ్ల పాటు ఉద్యోగులకు జీతాలు పెండింగ్ పెట్టడం గమనార్హం. ప్రతి నెలా జీతాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కలిసి విన్నవించడానికి సమాయత్తమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్