మృత్యుకేళి ఇది.. జాగ్రత్త సుమా!
అమరావతి మండలం కృష్ణానది తీరంలోని ధరణికోట రేవు ప్రాంతమిది. ఇక్కడ 2020 మార్చి 15న సాయి (19), గోవర్ధన్ (20) ఈతకు దిగి నీటమునిగి చనిపోయారు. ఇక్కడే 2021 అక్టోబరు 3న మోదుగల దుర్గాప్రసాద్ (17), ఆనంద అరవింద్ కుమార్ (24) స్నానానికి దిగి మృత్యువాత పడ్డారు. 2022 నవంబరు 11న తొండపు మణికంఠ (9) ఆడుకుంటూ వెళ్లి నదిలో పడి మృతి చెందారు.
అమరావతి మండలం కృష్ణానది తీరంలోని ధరణికోట రేవు ప్రాంతమిది. ఇక్కడ 2020 మార్చి 15న సాయి (19), గోవర్ధన్ (20) ఈతకు దిగి నీటమునిగి చనిపోయారు. ఇక్కడే 2021 అక్టోబరు 3న మోదుగల దుర్గాప్రసాద్ (17), ఆనంద అరవింద్ కుమార్ (24) స్నానానికి దిగి మృత్యువాత పడ్డారు. 2022 నవంబరు 11న తొండపు మణికంఠ (9) ఆడుకుంటూ వెళ్లి నదిలో పడి మృతి చెందారు.
అమరావతిలోని ధ్యానబుద్ధ పర్యటక కేంద్రం సమీపంలోని కృష్ణానది తీరమిది. ధ్యానబుద్ధ ప్రాజెక్టు చూడడానికి వచ్చిన పర్యటకులు సరదాగా నదిలో స్నానానికి దిగుతున్నారు. వినాయక చవితి పండగ సందర్భంగా నదిలో వినాయక నిమజ్జనానికి ఇక్కడ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జాగ్రత్తలు తీసుకుంటున్నా తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ 2022 సెప్టెంబరు 9న రొంపిచర్లకు చెందిన సిరిపురపు మల్లిఖార్జునరావు (29), లేమల్లెకు చెందిన బలుసుపాటి విజయ్ భార్గవ్ (27) వినాయక చవితి నిమజ్జనానికి వచ్చి నదిలో పడి చనిపోయారు.
ఇది ప్రకాశంబ్యారేజీ ఎగువన కొండవీటి ఎత్తిపోతల పథకం సమీపంలో నదీ తీరం. ఉండవల్లి, విజయవాడ నుంచి వచ్చే యువత ఇక్కడ నదిలో స్నానాలకు దిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడే పడవల రేవు సమీపంలో ఏప్రిల్ 15న విజయవాడ కృష్ణలంకకు చెందిన ఐటీ ఇంజినీరు జయకృష్ణ(23) స్నేహితులతో కలిసి నదిలో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తూ నీటమునిగి చనిపోయారు.
ప్రథమ పంచారామం అమరావతి ఆలయం ముందు ఘాట్ ఇది. ఆలయానికి వచ్చే పర్యటకులతో పాటు అమరావతిలో శివాలయం చెంతన కర్మకాండలు చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. దీంతో ఈ ఘాట్ ఎప్పుడూ జన సందడితో ఉంటుంది. స్థానికేతరులు ఎక్కువగా వస్తుండడంతో వారికి ఇక్కడి నదిలో లోతుపై అవగాహన లేక దిగి మృత్యువాత పడుతున్నారు. అమరేశ్వరఘాట్లో 2021 మార్చి 10న అమరావతికి చెందిన పఠాన్ బాజీ (8), షేక్ మీరా హుస్సేన్ (12) ఆడుకుంటూ నీటిలో దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2021 మార్చి 5న గుంటూరు నుంచి భర్తకు కర్మకాండలు చేయడానికి వచ్చిన ఒగ్గు వెంకట సామ్రాజ్యలక్ష్మీ (69) ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందారు. 2021 ఏప్రిల్ 4న తెలంగాణ నుంచి అమరావతిలో బంధువుల ఇంటికి వచ్చిన బొడ్డు గంగమ్మ (25) నీటిలో దిగి మృత్యువాత పడింది. 2020 జనవరి 8నగుంటూరుకు చెందిన ఎలికా వెంకటసుబ్బయ్య ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయారు. అమరావతికి చెందిన రేఖా ఏడుకొండలు 2020 ఏప్రిల్ 23న నదిలో చేపల వేటకు వెళ్లి అమరేశ్వరఘాట్లో శవమై తేలారు. 2023 మార్చి 30న 75 త్యాళ్ళూరు గ్రామానికి చెందిన కొల్లి భార్గవరామ నాగ మల్లికార్జునరెడ్డి(17), కీసర రాజశేఖరరెడ్డి (16) సరదాగా నదిలో దిగి మునిగిపోయారు. గుంటూరుకు చెందిన మహబూబ్ఖాన్ రంజాన్ ఉపవాసాల తర్వాత 2023 ఏప్రిల్ 23న పఠాన్ మహబూబ్ఖాన్ (58) కుటుంబ సభ్యులతో కలిసి స్నానానికి వచ్చి నదిలో దిగి మునిగి మృత్యువాత పడ్డారు. * దిడుగు రేవులో 2020 జులై 9న మాగులూరి బాలశౌరి (54), 2023 మార్చి 17న షేక్ పెద్దబాజీ(25) నీటిలో దిగి ప్రమాదవశాత్తూ మృతి చెందారు.
ఇది తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర్ఘాట్ సమీపంలో ఉన్న రైల్వేవంతెన మార్గం ప్రాంతం. సీతానగరంలోని ఆలయాలకు వచ్చే భక్తులతో పాటు స్థానికులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ మే 27న రైల్వేవంతెన కింద నది గోతుల్లో పడి డోలాస్నగర్కు చెందిన కృష్ణయ్య(16), శివశంకర్(17)లు నదిలో ఆరుగురితో కలిసి స్నానానికి వచ్చి నీటమునిగి చనిపోయారు. గతంలో ఇదే ప్రాంతంలో ఈతకు దిగి ప్రమాదవశాత్తూ గోతుల్లో మునిగిపోయి ఆరుగురు మృత్యువాత పడ్డారు.
రక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రాంతాలివే...
కృష్ణానదీ తీరంలో ఇసుక గోతులు మృత్యుకుహరాలుగా మారుతున్న సంగతి తెల్సిందే. పుణ్య స్నానాలు చేయడానికి నదిలోకి దిగినవారిని గోతులు కబళిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో పదుల సంఖ్యలో యువకులు, చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఏళ్లు గడుస్తున్నా తమ వారిని పోగొట్టుకున్న కుటుంబాల్లో విషాదం మిగిలే ఉంది. తమ పిల్లలు గుర్తుకొచ్చిన ప్రతిసారి గుండె కోతను అనుభవిస్తూనే ఉన్నారు. భవిష్యత్తు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఎక్కడెక్కడ రక్షణ చర్యలు చేపట్టాలో పరిశీలించేందుకు న్యూస్టుడే బృందం కొన్ని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించింది. ఆయా చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా మరెవరూ మృత్యు కుహరాల్లో కాలుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్