చేతులూపడమేనా.. చేతల్లేవా జగన్!
ఏ ప్రభుత్వానికైనా విశ్వస నీయత ఎంతో ముఖ్యం.. పదవిలో ఉన్నవారు అది నిలబెట్టుకోవడం ఎంతో అవసరం.. అని వైకాపా అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తరచూ మాటలు వల్లెవేసేవారు. కానీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్న జగన్ ఆచరణలో ఆ మాటే మరిచారు.
సీఎం హోదాలో ఇచ్చిన హామీలూ నెరవేర్చలేదు
మరోసారి మాయమాటలతో మోసగించేందుకు బస్సు యాత్ర
ఏ ప్రభుత్వానికైనా విశ్వస నీయత ఎంతో ముఖ్యం.. పదవిలో ఉన్నవారు అది నిలబెట్టుకోవడం ఎంతో అవసరం.. అని వైకాపా అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తరచూ మాటలు వల్లెవేసేవారు. కానీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్న జగన్ ఆచరణలో ఆ మాటే మరిచారు. సీఎం హోదాలో పల్నాడు ప్రాంతానికి ఆరుసార్లు వచ్చారు. వచ్చినా ప్రతిసారీ ఎన్నో హామీలు గుప్పించారు. కొన్నిచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సైతం చేశారు. కానీ సీఎంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. జిల్లాకు వచ్చి తాను ఉన్నానంటూ చేతులు ఊపి వెళ్లిపోవడం తప్ప, తమకు చేసిందేంటని పల్నాడు వాసులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు బస్సు యాత్ర పేరుతో తమను మళ్లీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు.
ఈనాడు డిజిటల్-నరసరావుపేట, న్యూస్టుడే-నరసరావుపేట అర్బన్, రొంపిచర్ల, నరసరావుపేట టౌన్, పెదకూరపాడు, అచ్చంపేట, మాచర్ల గ్రామీణ
కృష్ణా నదిపై ప్రయాణం గాల్లో దీపమే..
గతేడాది జూన్ 12న పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని క్రోసూరులో విద్యాకానుక కిట్లు అందజేసే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్రెడ్డి మాదిపాడు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొమ్మిది నెలలు గడుస్తున్నా వంతెన నిర్మాణం టెండర్ల దశ దాటలేదు. దీంతో నది దాటేందుకు ఇప్పటికీ పడవల్లో ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నారు.
నదిని దాటేందుకు పడవలో వెళ్తున్న పల్నాడు వాసులు
ఇంకెన్ని ప్రాణాలు పోవాలో..
వంద పడకల ఆసుపత్రులు ఒట్టిమాటే..
సకాలం చికిత్స అందక మాచర్లలో మృతి చెందిన తల్లీపిల్లలు వీరే..
సీఎం హోదాలో జగన్ వినుకొండ, మాచర్ల వచ్చినప్పుడు ఈ రెండుచోట్ల ఆసుపత్రి స్థాయిని వంద పడకల స్థాయికి పెంచుతానని హామీనిచ్చారు. కానీ ఆచరణలో మాత్రం మాటమరిచారు. అత్యంత వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో వైద్య సేవల నిమిత్తం గుంటూరుకు పోవాల్సిన పరిస్థితి. అదే ఆసుపత్రి అందుబాటులో ఉంటే ఎందరో ప్రాణాలు నిలిచేవి. మాచర్ల మండలం ఏకోనాంపేట శివారులోని నారాయణరెడ్డిపురంలో ఫిబ్రవరి 4న క్షణికావేశంలో ఓ తల్లి టీలో ఎలుకల మందు కలిపి తాను తాగడంతోపాటు పిల్లలకు, భర్తకు ఇచ్చింది. వెంటనే వారిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ సరైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో నరసరావుపేటకు తరలించారు. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు చనిపోయారు. అదే మాచర్లలో మెరుగైన చికిత్స అంది ఉంటే ఆ కుటుంబం బతికి ఉండేది.
చీకట్లు తొలగే మార్గమేదన్నా..
పల్నాడు జిల్లాలో లోఓల్టేజీ సమస్యతో పంట పొలాల్లో మోటార్లు కాలిపోతున్నాయని, సామర్థ్యం మేరకు విద్యుత్తు సరఫరా కాకపోవడంతో గృహోపకరణాలు దెబ్బతింటున్నాయి. క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కాలేదు. ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినా ఆ దిశగా ఊసే లేదు. అచ్చంపేట మండలం రోకటిగుంటవారిపాలెం వద్ద 132/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి స్థల సేకరణే చేపట్టలేదు.
నరసరావుపేటలో ఆటోనగర్ కలే
రెండేళ్ల కిందట నరసరావుపేటలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. రెండేళ్లు గడిచినా కేవలం శిలాఫలకం ఆవిష్కరణకే పరిమితమైంది. ఎన్నికల వేళ మార్చి రెండో వారంలో కేసానుపల్లిలో మోటారు కార్మికులతో చర్చించకుండా ఏకపక్షంగా కొబ్బరికాయ కొట్టేశారు. ఇప్పుడు పట్టణంలో 600 మంది మెకానిక్లు అధికారికంగా నమోదు కాగా, వారంతా పట్టణంలోనే పనులు చేస్తున్నారు. దీంతో పట్టణ వాసులకు ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు కాలుష్యం సమస్య ఎదురవుతుంది. మరోవైపు మెకానిక్లకు ఉపాధి కల్పిస్తానని సీఎం జగన్ చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి.
పల్నాట విద్యాభివృద్ధి శూన్యం..
వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యకు పెద్దపీట వేస్తామని, రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని రెండేళ్ల క్రితం నరసరావుపేటకి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. విద్యా సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ సీఎం హామీ అమలుకు నోచుకోలేదు. వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలకు సంతగుడిపాడులోని ఎన్నెస్పీ కాలనీలో స్థలం పరిశీలించారు. ప్రచార ఆర్భాటం తప్ప ఒక అడుగు ముందుకు పడలేదు.
2 వినుకొండలో ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మంజూరు చేస్తున్నానని, రూ.10 కోట్లు ఇస్తున్నానని మాటిచ్చారు. కానీ ఆచరణలో మాటతప్పారు.
మాటల్లోనే పైవంతెన నిర్మాణం
మల్లమ్మ సెంటర్ వద్ద ట్రాఫిక్
మీ ఎమ్మెల్యే నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య ఉందని, ఒక పైవంతెన కావాలని అడిగారు. అది మంజూరు చేస్తున్నానని సీఎం హోదాలో జగన్ రెండేళ్ల క్రితం ప్రకటించారు. పైవంతెన మంజూరు ఉత్తర్వులు, నిధుల కేటాయింపు, సమగ్ర పథక నివేదిక(డీపీఆర్)పై అధికారుల్లో స్పష్టత కరవైంది. పైవంతెన నిర్మించే ప్రాంతంలో వైకాపా నాయకుల దుకాణాలే అధికంగా ఉండటంతో ఆదిలోనే అటకెక్కింది. జిల్లా కేంద్రంగా మారిన పేటలో ట్రాఫిక్ కష్టాలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
[ 17-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. -
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
[ 17-05-2024]
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
[ 17-05-2024]
ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. -
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
[ 17-05-2024]
వైకాపాకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. -
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
[ 17-05-2024]
గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. -
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
[ 17-05-2024]
తెనాలి వైకాపా ఎమ్మెల్యే శివకుమార్ బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. -
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
[ 17-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం సిట్ వేయనుంది. -
పంచాయతీలో పండ్ల వ్యాపారం
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కోరినపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం మామిడి పండ్లు అమ్మకానికి పెట్టారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. -
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
[ 17-05-2024]
పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. -
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అత్తెసరు బోధన.. అరణ్య రోదన..
[ 17-05-2024]
జిల్లాలో 17 చోట్ల హైస్కూల్ ప్లస్ టూ బాలికల జూనియర్ కళాశాలలను ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. -
తలొగ్గారని తప్పించారు
[ 17-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి. -
ఎన్నికల రుసుముల్లో కోత!
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్ పోలింగ్ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్లోనూ కొందరు రిటర్నింగ్ అధికారులు కోత విధించారు. -
మిగ్జాంతోనైనా కళ్లు తెరవరా?
[ 17-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. -
టిప్పర్ డీజిల్ ట్యాంకు పగలడం వల్లే బస్సు దహనం
[ 17-05-2024]
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారులు పరిశీలన చేశారు. -
మార్కెట్ల తరలింపు ఎప్పుడో..?
[ 17-05-2024]
నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు. -
సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం
[ 17-05-2024]
కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆర్వోలకు సూచించారు. -
సర్పంచి ఇంటిపై వైకాపా రౌడీమూక దాడి
[ 17-05-2024]
బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. -
అద్దంకి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలి
[ 17-05-2024]
అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
18 మందిపై కేసుల నమోదు
[ 17-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని కారంపూడిపాడులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలపై 15న గ్రామంలోని 18 మందిపై డిప్యూటీ తహసీల్దారు డి.వెంకటరావు కేసులు నమోదు చేశారు. -
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
[ 17-05-2024]
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానయానం.. మూడు నెలల్లో 9.7 కోట్ల మంది!
-
ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య