ఈ అరాచకాల్ని.. ఆపేదెవరు..?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది.
పల్నాడులో మొదలైన ఘర్షణలు
పరస్పర దాడులతో భయాందోళన
ప్రశాంత ఎన్నికలకు పోలీసుల చర్యలేవీ
ఈనాడు, నరసరావుపేట
2019 ఎన్నికల్లో వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన కోడెల (పాత చిత్రం)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది. ప్రచార సమయంలో ఇక్కడ తెదేపా, వైకాపా మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. బాంబులు, వేటకొడవళ్లు, మారణాయుధాలు వెలుగుచూస్తున్నాయి. అధికార పార్టీ వారు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో దాడులకు పాల్పడుతున్నారు. గురజాల, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేయడం, ఏజెంట్లపై దాడులు చేసి కొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. సత్తెనపల్లిలో అప్పటి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, నరసరావుపేటలో అప్పటి ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, మాచర్లలో తెదేపా అభ్యర్థి బంధువుల వాహనంపై దాడులు చేసి ధ్వంసం చేశారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శాంతియుత ఎన్నికలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని పల్నాడు ప్రజలు కోరుతున్నారు.
వరుస సంఘటనలతో ఆందోళన
పల్నాడు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్రోజు నరసరావుపేటలో వైకాపా నేతలు తెదేపా నేతలపై దాడులు చేసి వాహనాలు ధ్వంసం చేశారు. వెల్దుర్తి మండలంలో తెదేపా, వైకాపా వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ముప్పాళ్ల మండలంలో తెదేపా నేతలపై వైకాపా నేతలు దాడులకు తెగబడ్డారు. పోలింగ్కు ముందే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఒక్కరోజే మూడు గ్రామాల్లో ఘర్షణలు చెలరేగి తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. అచ్చంపేట మండలం కొండూరులో తెదేపా, వైకాపా వర్గాల మధ్య గొడవ జరిగింది. గురజాల మండలం చర్లగుడిపాడులో తెదేపా నేత లక్ష్మీనారాయణపై వైకాపా మూకలు దాడిచేశాయి. నకరికల్లు మండలం కుంకలగుంటలో వైకాపా-తెదేపా నేతల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది.
చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో 221 పోలింగ్ కేంద్రంలో వైకాపా వర్గీయులు తెదేపా కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. ఒక ఓటు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీయడంతో వైకాపా వర్గీయులు కర్రలు, సోడా సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు తెదేపా కార్యకర్తలు గాయపడటంతో పోలింగ్ నిలిపేశారు.
2019లో పోలింగ్ రోజు ఘటనలెన్నో..
- నరసరావుపేట నియోజకవర్గం గోగులపాడు, వినుకొండ మండలం పానకాలపాలెంలో ఈవీఎంలను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. ్ర సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్దే దాడిచేసి గాయపరిచారు.
- బొల్లాపల్లి మండలంలో వెంకటరెడ్డిపురం తండాలో వైకాపా, తెదేపా కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
- నరసరావుపేట మండలం రంగారెడ్డిపాలెంలో వైకాపా ఏజెంట్లు తెదేపా ఏజెంట్లను పోలింగ్ కేంద్రం బయటకు నెట్టేశారు.
- కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో తెదేపా వర్గీయులపై వైకాపా వాళ్లు రాళ్లదాడి చేసి ఇద్దరు తెదేపా కార్యకర్తలను గాయపరిచారు.
- దుర్గిలో తెదేపా, వైకాపా నాయకుల మధ్య రాళ్ల దాడి జరగటంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓ మహిళ గాయపడింది.
- మాచర్లలో అప్పటి తెదేపా అభ్యర్థి అంజిరెడ్డి మామ వెంకట్రామిరెడ్డిపై వైకాపా నాయకుల దాడిచేసి ఆయన వాహనం అద్దాలు పగులకొట్టారు.
- నరసరావుపేట మండలం ఉప్పలపాడులో యథేచ్ఛగా రిగ్గింగ్ జరిగిందనీ అప్పటి తెదేపా ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు ఆర్వో హిమాన్షు శుక్లాను కోరారు. స్థానిక వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి ఉప్పలపాడులో ఉద్రిక్తతలను పెంచి తెదేపా, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను బయటకు లాగేయడంతో తిరిగి ఏజెంట్లను కేంద్రాల్లో కూర్చోబెట్టేందుకు వెళ్లిన తెదేపా అభ్యర్థి అరవిందబాబు, మీడియాపై దాడి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
[ 20-05-2024]
బాధితుల వేదన ప్రసారం చేయడం తప్పెలా అవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
[ 20-05-2024]
అధికారులను మార్చిన చోటే ఘర్షణలు జరిగాయని వైకాపా ఆరోపిస్తోందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. -
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
[ 20-05-2024]
పల్నాడులో జరిగిన అల్లర్లను తానే సృష్టించినట్లు వైకాపా నేతలు విష ప్రచారం చేస్తున్నారని లావు శ్రీకృష్ణదేవరాయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
[ 20-05-2024]
పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటమే తన మొదటి లక్ష్యమన్నారు. -
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
[ 20-05-2024]
రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. -
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!