Hyderabad : రద్దీ ఉన్నా రద్దా?
ప్రయాణికులు లేకే ఆదివారం ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు సగానికి సగం తగ్గిస్తున్నామని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఎక్కడ చూసినా రద్దీ
ఎంఎంటీఎస్ సర్వీసుల కోతతో ప్రయాణికులకు ఇబ్బంది
ఆదివారం సాయంత్రం ఎంఎంటీఎస్లో రద్దీ
ఈనాడు, హైదరాబాద్: ప్రయాణికులు లేకే ఆదివారం ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు సగానికి సగం తగ్గిస్తున్నామని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఎక్కడ చూసినా రద్దీ విపరీతంగా ఉంది. ఆదివారం రైళ్లే కాదు.. సిబ్బందిని కూడా కుదించడంతో టిక్కెట్ల కోసం బారులుతీరాల్సి వస్తోంది. ఇంతలో గంటకో.. రెండు గంటలకో వచ్చే ఎంఎంటీఎస్ తుర్రుమంటూ వెళ్లిపోతోంది. ప్రయాణికులు టిక్కెట్లు తీసుకోకుండానే ఎంఎంటీఎస్ వెళ్లిపోతుండడంతో మళ్లీ వచ్చే రైలు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇలా ప్రతి రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్ ప్రయాణికులు ఆదివారం అవస్థలు పడుతున్నారు.
స్టేషన్కొకరే విధుల్లో..
ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు టిక్కెట్లు రిజర్వు చేసుకుంటారు. సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్లకు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో టిక్కెట్లు ఇస్తుంటారు. ఇక్కడ ఎంఎంటీఎస్ ఎక్కి.. ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి దూరప్రాంతాల రైళ్లను అందుకోవాల్సిన వారు ఇబ్బందిపడుతున్నారు. రోజూ ఇద్దరు టిక్కెట్లు ఇచ్చే వారుంటారు. దూరప్రాంత రిజర్వేషన్ టిక్కెట్లు ఇచ్చేవారు మరొకరుంటారు. ఇలా ముగ్గురికి బదులు ఆదివారాల్లో ఒక్కరే ఉంటున్నారు. ఒక్కరే ఎంఎంటీఎస్, ప్యాసింజర్ రైళ్లకు టిక్కెట్లు ఇవ్వడానికి ఆలస్యం అవుతోంది. దీంతో కౌంటర్ల ముందు బారులుదీరిన ప్రయాణికులు తీవ్ర అసహనంతో ఉన్న ఒక్క ఉద్యోగిపై విరుచుకుపడుతున్నారు.
ఏ రైలు ఎప్పుడొస్తుందో..
కరోనాకు ముందు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నగర ప్రయాణికులకు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 75 సర్వీసులే నడుపుతున్నారు. ఆదివారం వస్తే వాటిని 35కే పరిమితం చేస్తున్నారు. నగరంలో మిగతా రోజుల్లో కార్యాలయాలకు, కూలీ పనులకు వెళ్లేవారు.. ఆదివారం నాడు షాపింగ్లకు, బంధువుల ఇళ్లకు ఎక్కువ మొత్తంలో వెళ్తున్నారు. నగరంలో శని, ఆదివారాల్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్సులు, ఎంఎంటీఎస్లు, మెట్రో పూర్తి రద్దీగా మారుతున్నాయి. ఎంఎంటీఎస్లు సగానికి సగం కోత వేయడంతో ఏ రైలు ఎప్పుడొస్తుందో తెలియని గందరగోళం ఏర్పడుతోందని.. స్టేషన్లలో ఆ సమాచారం ఉండడంలేదని.. కౌంటర్లో అడిగితే మేము చెప్పలేమని సమాధానాలు వస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. 75 సర్వీసులు మొత్తం నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ర్యాంకర్లను సత్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
[ 04-05-2024]
భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం సివిల్ సర్వీస్ ర్యాంకర్లకు మాత్రమే లబిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. -
క్రషర్ క్వారీలో పడి మరో యువకుడు బలి
[ 04-05-2024]
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల వ్యవధిలోనే మరో యువకుడు క్రషర్ క్వారీలో పడి గౌతమ్ (21)మృతి చెందాడు. -
అబద్ధాల కాంగ్రెస్ను శిక్షించాల్సిందే: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
[ 04-05-2024]
సాయంత్రం సమయం.. అంతా చూస్తుండగానే ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన ఐదు గంటలపాటు మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
[ 04-05-2024]
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
[ 04-05-2024]
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు మొదటి నుంచి స్థానికేతరులకే పట్టంకడుతున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారు విజయం సాధించలేకపోయారు. -
గడప దాటిస్తే ... గండం గడిచినట్లే
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడటంతో బూత్ మేనేజ్మెంట్పై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రచారం ఒకెత్తయితే పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం చాలా కీలకం. -
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
[ 04-05-2024]
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
[ 04-05-2024]
తక్కువ ధరకే ప్లాట్లు విక్రయిస్తామంటూ దంపతులు 15 మందికి రూ.12.35 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. తప్పుడు ప్రకటనలు, ఫోర్జరీ పత్రాలతో మోసగించిన వీబీజే క్యాప్స్టోన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కందుల వెంకట ప్రసాద్ గుప్తా, ఆయన భార్య అనురాధను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటనలో తెలిపారు. -
నగర ఓటరు.. తీర్పు ఎప్పటికప్పుడు మారు
[ 04-05-2024]
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో నగర ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నినెలల వ్యవధిలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. -
సైబర్సిటీలో భారీగా వాడకం
[ 04-05-2024]
ఐటీ కార్యాలయాలు, ఆకాశహర్మ్యాలు, పరిశ్రమలకు నిలయమైన సైబర్సిటీ సర్కిల్ పరిధిలో వేసవిలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. సిటీలోని తొమ్మిది సర్కిళ్లలో ఇక్కడే అత్యధిక వాడకం నమోదైంది. -
బంధాన్ని కాదని.. భర్తను బంధించి
[ 04-05-2024]
ఆస్తి కోసం భార్య ఇనుప గొలుసుతో కట్టేసి భర్తను చిత్రహింసలు పెట్టింది. ఘట్కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్లోని అంబేడ్కర్నగర్కు చెందిన సెంట్రింగ్ గుత్తేదారు పత్తి నరసింహ(50) భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. -
తరుణీ కరుణించు
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల కోసం రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. -
పట్టణ ఓటరుపై పట్టుకు..
[ 04-05-2024]
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గేటర్లో రాజకీయ వేడి మొదలైంది. మహానగరంలో 28 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. -
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
[ 04-05-2024]
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు బుద్ధిచెప్పాలని మజ్లిస్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
రంజిత్రెడ్డికి ఓట్లతో గుణపాఠం చెప్పాలి
[ 04-05-2024]
రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన భారాసకు ద్రోహం చేసిన రంజిత్రెడ్డికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. శంకర్పల్లిలో శుక్రవారం ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. -
తపాలా ఓటులో తడబాటు.. వెనుదిరిగిన ఓటర్లు
[ 04-05-2024]
రాజధానిలో కోటి పదిలక్షల మంది ఓటర్లుండగా.. సుమారు పది వేల పోలింగ్ కేంద్రాల్లో 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. భద్రతా సిబ్బంది, ఇతర సహాయ సిబ్బంది కలిపితే మరో 20వేల మంది ఉంటారు. -
ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ కుట్ర
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారాస కుట్రలు చేస్తుందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక పట్టణంలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కౌన్సిలర్ భరత్ బృందం పార్టీలో చేరిన సందర్భంగా సభ నిర్వహించారు. -
మా అభ్యర్థులను గెలిపించుకుంటాం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మున్నూరు కాపు అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించుకుంటామని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్రావు ప్రకటించారు. -
నక్షత్రాలు,గ్రహాల గుట్టు తెలుసుకుందాం
[ 04-05-2024]
వినూత్న పరిశోధనలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు.. అంతరిక్ష పరిశోధనలపై ప్రోత్సహించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మినీ అబ్జర్వేటరీని ప్రారంభించింది. -
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
[ 04-05-2024]
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాదబాటపై నడుచుకుంటూ వెళ్తున్న హార్డ్వేర్ ఇంజినీర్ విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరిగుట్టకి చెందిన తుమ్మ భావన రుషి (35) రెండేళ్ల క్రితం సుజాత అనే ఉపాధ్యాయురాలిని ప్రేమ వివాహం చేసుకొని వెంకటగిరిలో నివసిస్తున్నాడు. -
ఎవరిదో పైచేయి
[ 04-05-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (టీఆర్ఆర్, గడ్డం ప్రసాద్కుమార్, బుయ్యని మనోహర్రెడ్డి), భారాసకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు (ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్) తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు సాధించడంపై దృష్టి నిలిపారు. -
భారాస విజయానికి వ్యూహ రచన
[ 04-05-2024]
తాండూరులో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తాండూరు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్ కుమార్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!