Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
అబిడ్స్కు చెందిన యువతి బీటెక్ పూర్తిచేశారు. ఉద్యోగ వేటలో ఉండగా మొబైల్ ఫోన్కు ఓ సందేశం వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ రోజూకు రూ.700-900 సంపాదించొచ్చంటూ ఆశ చూపారు.
మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఎత్తులు
ఈనాడు, హైదరాబాద్
అబిడ్స్కు చెందిన యువతి బీటెక్ పూర్తిచేశారు. ఉద్యోగ వేటలో ఉండగా మొబైల్ ఫోన్కు ఓ సందేశం వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ రోజూకు రూ.700-900 సంపాదించొచ్చంటూ ఆశ చూపారు. రూ.2,000 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకున్నారు. నెల తర్వాత డిజిటల్ ఖాతాలో రూ.28వేల ఆదాయం చూపారు. ఆ సొమ్ము విత్డ్రా చేసుకునేందుకు అదనంగా రూ.50 వేలు డిపాజిట్ చేయాలన్నారు. సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్ పెంచుతూ వచ్చారు. రూ.5 లక్షలు డిపాజిట్ చేయించుకొని ఖాతా రద్దు చేశారు.
‘‘కేవలం 10-30 నిమిషాలు కేటాయించండి. రోజు రూ.200-300 వరకూ సంపాదించండి. మొబైల్ ఫోన్ మీ చేతిలో ఉందా! ఎందుకు ఆలస్యం’’ అంటూ గృహిణులు, యువతులను సైబర్ మాయగాళ్లు మోసం చేస్తున్నారు. పార్ట్టైం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఆశల వల విసురుతున్నారు. నగరంలో సైబర్ క్రైమ్కు వస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఉద్యోగం, పెట్టుబడులకు సంబంధించిన మోసాలే ఉంటున్నాయి. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో 2-3 గంటలు కష్టపడితే చాలనే ఉద్దేశంతో బాధితులు అవతలి వారి మాటలను నమ్ముతూ ఉచ్చులో చిక్కుతున్నారు.
సంపాదన.. పెట్టుబడి అంటూ
గతంలోదీపపు వత్తులు, కరక్కాయ పొడి, గ్రంథాలను పీడీఎఫ్గా మార్చి రూ.లక్షలు సంపాదించమంటూ సామాజిక మాధ్యమాల వేదికగా మోసగాళ్లు చెలరేగారు. ప్రస్తుతం ఆన్లైన్ వేదికగా పార్ట్టైమ్ ఉద్యోగాల పేరిట మోసాలకు తెరలేపారు. ఉద్యోగ వేటలో ఉన్న యువతులు తేలికగా బుట్టలో పడుతున్నారు. ఆన్లైన్లో కొలువు నిర్వర్తిస్తూ.. అదే కంపెనీలో పెట్టుబడితో రెండు చేతులా సంపాదనంటూ ప్రకటనలతో ఆకట్టుకుంటున్నారు. స్నేహితులు, బంధువులను సభ్యులుగా చేర్పించి.. మరింత లాభపడమంటూ మోసగాళ్ల సూచనతో తెలిసినవారితో పెట్టుబడి పెట్టిస్తున్నారు.
అటువంటి ప్రకటనలు నమ్మొద్దు
- నేహా మెహ్రా, డీసీపీ, సైబర్క్రైమ్ హైదరాబాద్
బాధితుల్లో కేవలం మహిళలు, యువతులే కాదు.. అన్ని వర్గాల వారున్నారు. ఇంట్లో ఉంటూ సంపాదించే అవకాశం ఉందనగానే తేలికగా నమ్మేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు వచ్చే ఇటువంటి ప్రకటనలు నమ్మొద్దు. వాస్తవాలు తెలియకుండా పెట్టుబడి పెట్టొద్దు. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం