Green Coffee: గ్రీన్ కాఫీతో మధుమేహం.. ఊబకాయం నియంత్రణ
చిక్కనైన ఫిల్టర్ కాఫీ రుచి ఆస్వాదిస్తూ దినపత్రిక చదువుతూ ఉత్తేజాన్ని పొందే వారికి శుభవార్త... మన జీవితంలో భాగమైన కాఫీని గ్రీన్టీ తరహాలో గ్రీన్ కాఫీగా తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయన్నాయని దీనిపై అధ్యయనం చేస్తున్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు చెబుతున్నారు.
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యుల అధ్యయనం
ఈనాడు, హైదరాబాద్: చిక్కనైన ఫిల్టర్ కాఫీ రుచి ఆస్వాదిస్తూ దినపత్రిక చదువుతూ ఉత్తేజాన్ని పొందే వారికి శుభవార్త... మన జీవితంలో భాగమైన కాఫీని గ్రీన్టీ తరహాలో గ్రీన్ కాఫీగా(Green Coffee) తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయన్నాయని దీనిపై అధ్యయనం చేస్తున్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు చెబుతున్నారు. గ్రీన్కాఫీలోని క్లోరోజెనిక్ ఆమ్లం మన శరీర బరువును తగ్గిస్తుందని.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుందని పేర్కొంటున్నారు. సాధారణంగా కాఫీ పొడిని తయారు చేసేందుకు కాఫీ గింజలను కాలుస్తారు. రోస్ట్(వేయించడం) చేస్తారు.. ఇలా చేయకుండా నేరుగా గింజల ద్వారా కాఫీని తయారు చేయడమేనంటున్నారు ఆచార్యులు జయసూర్యకుమారి, శ్రీవల్లి, ఎం.స్రవంతి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కాఫీపొడిని తయారు చేసేందుకు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయనున్నారు.
గ్రీన్ కాఫీ.. క్లోరోజెనిక్ ఆమ్లం.. అరబికా నుంచి రోబస్టా కాఫీ వరకూ వివిధ రకాల కాఫీ పరిమళం కావాలంటే గింజలను వేర్వేరుగా కాల్చాలి. ఇందుకు భిన్నంగా కాలం గింజలతో గ్రీన్ కాఫీని తయారు చేసుకోవచ్చు. సాధారణ కాఫీతో పోలిస్తే గ్రీన్ కాఫీ భిన్నమైన రుచి ఉంటుంది. ఇది తేలికగా.. మూలికల తరహాలో రుచి కలిగి ఉంటుంది, ఇది కాల్చిన కాఫీ గింజల కంటే ఎక్కువ స్థాయిలో క్లోరోజెనిక్ ఆమ్లం, తక్కువ కెఫిన్ ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉండే కాఫీ గింజలను రోస్ట్ చేయడం ద్వారా గోధుమ రంగులోకి మారుతాయి. వేయించిన, కాల్చిన కొద్దీ ఈ గింజలు కుళ్లిపోతాయి. క్లోరోజెనిక్ ఆమ్లం నాశనమవుతుంది. ఆకుపచ్చ కాఫీ గింజల్లోని క్లోరోజెనిక్ ఆమ్లం వీటిని తాజాగా ఉంచుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు.. గ్రీన్ కాఫీని రోజుకు ఒకసారి తాగినా క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కొవ్వును హరిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అదనంగా, ఇది వాపు, కొవ్వు నిల్వను గణనీయంగా తగ్గిస్తుంది. టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది. హృదయ స్పందనను నిలకడగా ఉంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తనాళాలను విస్తరిస్తుంది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ లక్షణాలన్నీ గ్రీన్ కాఫీలో ఉన్నాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్ పరిశోధకులు జె.ఎ.విన్సన్ ఇటీవల శాస్త్రీయంగా నిరూపించారు.
శాస్త్రీయ ఆధారాలు.. పరిశోధనలున్నాయ్
ప్రొ.జయసూర్యకుమారి
గ్రీన్ కాఫీని రోజుకు ఒకసారి తాగడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుందని శాస్త్రీయ, ఆధారాలు పరిశోధనలున్నాయి. వీటిని అధ్యయం చేసి రెండేళ్లుగా మేమే సొంతంగా ప్రయోగాలు చేస్తున్నాం. మా కుటుంబసభ్యులకు గ్రీన్కాఫీని తాగించి వారి శారీరక, మానసిక స్థితులను వైద్యుల ద్వారా తెలుసుకున్నాం. 90శాతం మందికి శరీరం బరువు తగ్గింది. టైప్2 మధుమేహం నియంత్రణకు వచ్చింది. అందుకే మా గ్రీన్కాఫీకి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు