Hyderabad: ఉప ఎన్నికలో ఊహించని మలుపు
కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికపై కాంగ్రెస్ పట్టుబిగించింది. తన వ్యూహాలతో దూకుడు పెంచి ప్రత్యర్థి పార్టీల కంటే ముందుకు సాగుతోంది. బరిలో నిలిపేందుకు గట్టి అభ్యర్థి కోసం చూస్తున్న ఆ పార్టీకి బలమైన నేత దొరికారు.
టిక్కెట్ హామీతో భాజపా నుంచి హస్తం గూటికి శ్రీగణేశ్
కంటోన్మెంట్పై పట్టుబిగించిన కాంగ్రెస్
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
శ్రీగణేశ్కు కాంగ్రెస్ కండువా కప్పుతున్న మహేశ్కుమార్, చిత్రంలో పట్నం మహేందర్రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు
కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికపై కాంగ్రెస్ పట్టుబిగించింది. తన వ్యూహాలతో దూకుడు పెంచి ప్రత్యర్థి పార్టీల కంటే ముందుకు సాగుతోంది. బరిలో నిలిపేందుకు గట్టి అభ్యర్థి కోసం చూస్తున్న ఆ పార్టీకి బలమైన నేత దొరికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్ నారాయణన్ మంగళవారం రాత్రి కాంగ్రెస్లో చేరారు. ఆయనకు కంటోన్మెంట్ టిక్కెట్ దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు హామీ లభించిన తరువాతే శ్రీగణేశ్ అప్పటికప్పుడు కాంగ్రెస్లో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాబలం ఉన్న గణేశ్ను కాంగ్రెస్లో చేర్చుకొని బరిలో నిలిపితే తమదే విజయమన్న భావనలో ఆ హస్తం పార్టీ నేతలు ఉన్నారు.
మధ్యాహ్నం వరకు భాజపా ప్రచారంలో..
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కంటోన్మెంట్ భారాస అభ్యర్థిగా ఎమ్మెల్యే లాస్యనందిత విజయం సాధించారు. గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొన్నటి ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్ను మరోసారి భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ దాదాపుగా నిర్ణయించింది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈసారీ ఆమెకే టిక్కెట్ దక్కుతుందని అంతా భావించారు. అయితే గట్టి అభ్యర్థిని నిలిపి కంటోన్మెంట్ను తమ ఖాతాలో వేసుకోవాలని దృష్టిపెట్టిన సీఎం రేవంత్రెడ్డి.. స్థానిక నేతలతో మాట్లాడారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న శ్రీ గణేశ్ను కాంగ్రెస్లో చేర్చుకొని అభ్యర్థిగా నిలిపితే బాగుంటుందని పలువురు సూచించారు. దీంతో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్రెడ్డి గణేశ్తో మాట్లాడారు. టిక్కెట్ హామీ ఇస్తే వస్తాననడంతో ఆ మేరకు హామీ లభించడంతో మంగళవారం రాత్రి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ నివాసంలో మైనంపల్లి, మహేందర్రెడ్డి సమక్షంలో గణేశ్ కాంగ్రెస్లోచేరారు. మంగళవారం మధ్యా హ్నం వరకు మల్కాజిగిరిలో భాజపా నేత ఈటలతో కలిసి ప్రచారంలో పాల్గొన్న శ్రీ గణేశ్.. రాత్రి కాంగ్రెస్లో చేరడంపై భాజపా నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారాస తరఫున సాయన్న కుమార్తె నివేదిత తనకు టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీనిపై ఆ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే..
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని శ్రీగణేశ్ నారాయణన్ తెలిపారు. ఈమేరకు రెండు రోజులుగా పార్టీ అగ్రనేతలు, మాజీ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్రెడ్డి, మైనంపల్లి హనుమంతరావుతో జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో కాంగ్రెస్లో చేరినట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తాచాటుతుందని శ్రీగణేశ్ నారాయణన్ ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువ వాటరూ.. నీదే జోరు
[ 28-04-2024]
యువ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్న నాయకులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది ఓటర్లు 18 నుంచి 39 ఏళ్లలోపు వారే ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకొంటే గెలుపు ఖాయమనే ధీమాలో నేతలున్నారు. -
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
[ 28-04-2024]
తెలంగాణలో తొలిసారిగా ఓ తమిళపార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ తరఫున హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్లు నామినేషన్లు దాఖలు చేశారు. -
అసత్య ప్రచారాలకు ‘మిత్ వర్సెస్ రియాలిటీ’తో చెక్
[ 28-04-2024]
అసత్య ప్రచారాలపై నియంత్రణ లేకుండా పోతోంది.. ఫలితంగా వాస్తవ సమాచారం దారి తప్పుతోంది. సామాజిక మాధ్యమాలు వేదికగా నిత్యం వివిధ అంశాలపై కోకొల్లలుగా వార్తలు, వదంతులు పుట్టుకొస్తున్నాయి. -
ఆలిన్లో అదుపులోకి అగ్నికీలలు
[ 28-04-2024]
ఆలిన్ ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు చల్లారక పోవడంతో భారీ నష్టం వాటిల్లింది. 24 గంటలు దాటినా మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో అటుగా ఉండే పరిశ్రమలు, కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించిన ఘటన నగరంలో ఐదో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
డార్మెటరీలో దోస్తీ.. చోరీలతో మస్తీ
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మెటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
నగరవాసి.. నీటికి అల్లాడి
[ 28-04-2024]
వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. -
బామ్మర్దికి వీడియోకాల్.. ఆపై బలవన్మరణం
[ 28-04-2024]
బామ్మర్దికి వీడియోకాల్ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన శనివారం కీసర మండలం చీర్యాలలో జరిగింది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం. బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేశ్యాదవ్(38)కు 12 ఏళ్ల క్రితం కీసర శివాజీ నగర్ కాలనీకి చెందిన భవానీతో వివాహమైంది. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 28-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గెలుపు బాధ్యత మీదే!
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారానికి మరింత పదును పెడుతున్నారు. ఉదయం మొదలు రాత్రి వరకు తమ పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు.