logo

వేసవిలో మిద్దె తోటలకు షేడ్‌ నెట్‌ తప్పనిసరి

ఎండల నుంచి మిద్దె తోటలను కాపాడుకోవడానికి తప్పని సరిగా షేడ్‌ నెట్‌ ఏర్పాటు చేసుకోవాలని రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు సూచించారు.

Published : 22 Apr 2024 03:24 IST

పంజాగుట్ట, న్యూస్‌టుడే: ఎండల నుంచి మిద్దె తోటలను కాపాడుకోవడానికి తప్పని సరిగా షేడ్‌ నెట్‌ ఏర్పాటు చేసుకోవాలని రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు సూచించారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో ఆదివారం మిద్దె తోటల ఏర్పాటు, నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచారసభ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని తోటల పెంపకంలో మెళకువల గురించి వివరించారు. మిద్దె తోటల నిపుణులు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని