విద్యుత్తు శాఖలో ఇంజినీర్ల బదిలీకి మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్తు సరఫరా సంస్థ పరిధిలో జిల్లాలో పనిచేసే ఇంజినీర్ల బదిలీకి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు సంస్థ జిల్లా పర్యవేక్ష ఇంజినీరు శోభావాలెంటీనా మార్గదర్శకాలు జారీ చేశారు.
కడప గ్రామీణ, న్యూస్టుడే : ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్తు సరఫరా సంస్థ పరిధిలో జిల్లాలో పనిచేసే ఇంజినీర్ల బదిలీకి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు సంస్థ జిల్లా పర్యవేక్ష ఇంజినీరు శోభావాలెంటీనా మార్గదర్శకాలు జారీ చేశారు. ఒకే ప్రాంతంలో మూడేళ్లు, ఆపైన పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావాలనుకునేవారికి సంస్థ కార్యాలయ పరిధి ఉన్నతాధికారులు బదిలీ చేస్తారు. స్పౌజ్, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా నిబంధనల నుంచి మినహాయించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగిన సమయంలోనే జిల్లాలోనూ బదిలీలు చేయాల్సి ఉంది. బద్వేలు, పురపాలక, స్థానిక ఎన్నికలు వరుసగా రావడం, వరదల కారణంగా బదిలీలు జరగలేదు. ఇప్పుడు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావడంతో ప్రక్రియ ప్రారంభించారు. మూడేళ్లు, ఐదేళ్లు ఒకే చోట ఎందరు పనిచేస్తున్నారనే సమాచారాన్ని గురువారం అధికారులు ప్రకటించనున్నారు. అనంతరం ఆ జాబితాలో ఉన్న ఇంజినీర్లు ఫిబ్రవరి 1వ తేదీలోపు ఏ ప్రాంతానికి బదిలీ (ఆప్షన్లు) కావాలనేది రాతపూర్వకంగా ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేదీలోపు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తామని ఎస్ఈ శోభావాలెంటీనా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి