పేదలవి కూల్చేసి..పెద్దలవి వదిలేసి !
కడప నగరం రామాంజనేయపురంలోని వడ్డెర కాలనీకి పైభాగంలో కుంట ఉంది. ఇక్కడ నుంచి వికలాంగుల కాలనీ, సబ్జైలు, యానాది కాలనీ, వడ్డెర కాలనీ, నిరంజన్నగర్, ఆర్కే నగర్లో చెరువు(ఇప్పుడు ఇళ్ల నిర్మాణం) ఉంది. నిరంజన్నగర్, వడ్డెరకాలనీ, యానాదికాలనీలో
కడప నగరంలో అనధికార కట్టడాల కూల్చివేతలో పక్షపాత ధోరణి
ప్రణాళిక లేకుండా అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా పనులు
ప్రకాష్నగర్లో అవసరం లేకున్నా పేదల ఇళ్ల కూల్చివేత
*సార్.. అయిదడుగుల కాలువ ఉంది... మరో అయిదడుగులు తీసుకోండి... మా ఇళ్లు మాత్రం కొట్టకండి. కూలి పనులు చేసుకుంటూ ఇల్లు కట్టుకున్నామని బతిమలాడినా కనికరించలేదు...
మా ప్రాంతం మునగడంలేదు ఇక్కడెందుకు ఇళ్లు కూల్చుతున్నారంటే మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ అడిగిన వ్యక్తి ఇంటిని మరింత భాగాన్ని కూల్చేశారు...
*ఓ వైపు నుంచి ఆక్రమణలు కూల్చివేస్తూ రావాలి కదా?... మధ్యలోనే ఎందుకు కూల్చుతారని అడిగితే?.. మా ఇష్టం మీరడిగే హక్కు లేదు... ఇంతకీ నీ ఇళ్లెక్కడంటూ బెదిరించారు...
*పేదలు తమ బాధను, జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనేందుకు కూడా సాహసించలేనంతగా భయపెట్టేశారు అధికారులు....
ఈనాడు డిజిటల్, కడప కడప నగరం రామాంజనేయపురంలోని వడ్డెర కాలనీకి పైభాగంలో కుంట ఉంది. ఇక్కడ నుంచి వికలాంగుల కాలనీ, సబ్జైలు, యానాది కాలనీ, వడ్డెర కాలనీ, నిరంజన్నగర్, ఆర్కే నగర్లో చెరువు(ఇప్పుడు ఇళ్ల నిర్మాణం) ఉంది. నిరంజన్నగర్, వడ్డెరకాలనీ, యానాదికాలనీలో మాత్రమే ఇళ్లు కూల్చేశారు. సమస్య తీవ్రత ఉన్న ఎన్జీవో, కో-ఆపరేటివ్ కాలనీ, రాజారెడ్డికాలనీ, అప్సర వలయంలో ఏమాత్రం పట్టించుకోలేదు. పేదలు నివాసం ఉన్న ప్రాంతంలో ఏమాత్రం కనికరం లేకుండా ఆవాసాలను నేలమట్టం చేసేశారు.
ప్రకాష్నగర్ వైపు చూస్తే...!
ఇక్కడ పది అడుగుల మురికినీటి కాలువ వెళుతుంది. నిర్వహణ లేక కొన్ని చోట్ల బహుళ అంతస్తుల ఇళ్లు కట్టుకున్న బడా నేతలు ఇష్టారాజ్యంగా కాలువను తవ్వేశారు. కాలువ నుంచి చుక్కనీరు ముందుకు కదలడం లేదు. చెత్తాచెదారం, మొక్కలు పెరగడంతో నీటి ప్రవాహం నిలిచిపోయింది. కాలువ పూడికతీత, తవ్వేసిన చోట చర్యలు చేపట్టిన తరుణంలో సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నా... ఇక్కడా పేదల ఇళ్లను కూల్చేశారు. దీంతో పలు కుటుంబాలు వీధినపడ్డాయి. నగరంలో పలు చోట్ల పలువురు బడానేతల ఆక్రమణలను పట్టించుకోలేదు. వీరి కారణంగా కాలువల్లో మురికినీటి ప్రవాహం చాలా చోట్ల అగిపోయింది. నేలలోకి ఇంకిపోవడం ద్వారా తాత్కాలికంగా సమస్యకు పరిష్కారం లభిస్తోంది.
రామాంజనేయపురంలోని వడ్డెర కాలనీలో కూల్చివేతలు
ఇంత చేసినా... పరిష్కారమవుతుందా?...
కడప నగరానికి అత్యంత కింద భాగంలో ఉన్న రామాంజనేయపురంతో పాటు ప్రకాష్నగర్లో కూల్చివేతతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆక్రమణల కూల్చివేత పనుల ద్వారా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం లేదు. నగరంలోని కాలువల్లో పూడిక తీత ఎక్కడా జరగడంలేదు. నగరమంతా ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరిగిపోయాయి. చిన్నచౌక్లోని రెడ్డికాలనీ అంతా మురికి కాలువల్లో నీటి ప్రవాహం లేక రహదారిపైకి చేరుతోంది. పాత బైపాస్రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి వస్తారని కాలువలను బండలతో కప్పిపుచ్చారు. మృత్యంజయకుంటను ఆక్రమించుకున్నారు. అన్ని ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలున్నాయి. వీటిని వదిలిపెట్టి అత్యంత కడుపేదల నివాసాలను దౌర్జన్యంగా కూల్చేశారు.
తొలగించాల్సిందే...అయితే?...
చెరువులు...నాలాల ఆక్రమణలతో వరదనీటి ప్రవాహానికి దారులు మూసుకుపోయి కడప నగరం ముంపునకు గురవుతోంది. ఆక్రమార్కుల ధాటికి నగరాల్లో మురుగు, వరదనీటి పారుదల వ్యవస్థలు చిన్నా భిన్నమవుతున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు కాలనీలు నీటమునగడంతో వేల కుటుంబాలు విలవిలలాడాయి. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 అడుగుల మేరకు కొన్ని రోజుల పాటు నీరు నిలిచిపోవడం గమనార్హం. ఈ తరుణంలో ఆక్రమణల తొలగింపు పేరిట గత కొన్ని రోజులుగా నగరంలో పనులు చేపట్టారు. ఈ చర్యను ఆహ్వానించాల్సి ఉన్నప్పటికీ ఇష్టారాజ్యంగా పేదలపైనే ప్రతాపం చూపించడం విమర్శలకు దారితీస్తోంది.
దీనికేం సమాధానం చెబుతారు?
నగరంలో ఎక్కడా కాలువలు నిర్వహిస్తున్న దాఖలాల్లేవు. చెత్తాచెదారం, మట్టితో నిండిపోయిన కాలువల్లో నెలల తరబడి పార పెట్టిన పరిస్థితి లేదు. సాధారణ వర్షపాతానికే వరద నీరంతా రహదారులపై ప్రవహిస్తోంది. నగరంలో 550 కిలోమీటర్ల పొడవున్న కాలువలు, 70 కిలోమీటర్ల పొడవున్న ప్రధాన కాలువలు ఉన్నా ఎక్కడా పూడిక తీయడంలేదు. వీటి నిర్వహణ చేపట్టడం ద్వారా కొంత వరకు వరద ముప్పును అధిగమించే అవకాశం ఉంది.
ఆక్రమణలన్నీ తొలగిస్తాం
కడప నగరంలో ఆక్రమణలన్నీ తొలగిస్తాం. కలెక్టరు ఆదేశాల మేరకు తొలుత ఏడు ముంపు ప్రాంతాలపై దృష్టి సారించాం. ఎవరినీ ఉపేక్షించకుండా ఆక్రమణలు తొలగిస్తాం. ఇందుకోసం పలు కమిటీలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాయి. -శివరామిరెడ్డి, తహసీల్దార్, కడప
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
మా ఇంటితో కాలువకు ఎలాంటి ముప్పులేదు. సమస్య ఉన్నచోట్ల పట్టించుకోలేదు. ఏదైనా సమస్య ఉందా? అని అడిగాం. రూ.8 లక్షలతో కట్టుకున్న ఇంటిని నిమిషాల్లో కూల్చేశారు. మా తల్లితో కలిసి వెళ్లి రెవెన్యూ అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. కాలువలో నీటిని కదలకుండా అడ్డుకునే వారి గురించి పట్టించుకోకుండా మమ్మల్ని వీధిన పడేశారు. మాకు ఏదిక్కూ లేకుండా పోయింది. -మహమ్మద్ షరీఫ్, ప్రకాష్నగర్ కాలనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు సాధిస్తా
[ 10-05-2024]
కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయడమే నా లక్ష్యం. ప్రాజెక్టు అవసరం లేదంటూ సీఎం జగన్ పక్కన పెట్టేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో బుధవారం జరిగిన ప్రజాగళం బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ సైతం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. -
సరకులిస్తానని డప్పు... ఉడకలేదు కందిపప్పు!
[ 10-05-2024]
బక్కజీవుల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషించే ప్రజా పంపిణీ వ్యవస్థను సీఎం జగన్ నీరుగార్చారు. సరకుల్లో కోత పెట్టారు. మరోవైపు ధరల మోతతో బడుగులపై అదనపు భారం వేశారు. -
కూటమితోనే ముస్లిం మైనార్టీలకు భరోసా
[ 10-05-2024]
అయిదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం గాలి కొదిలి, నేడు మళ్లీ ఓట్లు దండుకోవడానికి మాయమాటలు చెబుతున్నారని ఇలాంటి పార్టీ నాయకుల మాటలు ముస్లింలు నమ్మవద్దని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.షాజహాన్బాషా కోరారు. -
వైకాపా నేతలు... కబ్జాల మేతలు
[ 10-05-2024]
ప్రశాంతతకు మారుపేరైన మదనపల్లె పట్టణంలో వైకాపా పాలన అలజడి రేపింది... సీమలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న పట్టణం కావడంతో ఆంధ్రా ఊటీగా పేరొందింది.. చల్లటి వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. -
ఓటు వేసుకుంటాం... ఏజెంట్గా కూర్చుంటాం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యరీతిలో మాఓటు హక్కును వినియోగించుకుంటాం.. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లుగా నియమించుకుంటాం. -
విస్తృతంగా చేరికలు... పెరిగిన వలసలు
[ 10-05-2024]
ఎన్డీఏ కూటమిలో వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గురువారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. -
ఎమ్మెల్యే భూమిపూజ చేసి రెండేళ్లు... పూర్తికి ఇంకెన్నాళ్లు
[ 10-05-2024]
ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు అగ్నిమాపక శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా ఆగమేఘాల మీద వెళ్లాల్సి ఉంటుంది. -
కోడ్ ఉల్లంఘన.. ఊరూరా వైకాపా స్టిక్కర్లు
[ 10-05-2024]
పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఖాజీపేట మండలంలో అధికార పార్టీ కోడ్ ఉల్లంఘనల పరంపర పెరుగుతూనే ఉంది. -
జగన్ సభ వెలవెల
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నిక ప్రచారంలో భాగంగా రాజంపేటలో గురువారం సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభ వెలవెలబోయింది. -
మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం
[ 10-05-2024]
మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రస్తుతం ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
జగన్ డ్రామాలు ప్రజలు నమ్మరు
[ 10-05-2024]
సీఎం జగన్ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెదేపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు