రొయ్యలు పట్టేదెట్లా?
మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జలాశయాల్లో చేప పిల్లలతోపాటు రొయ్యల పిల్లలను వదులుతుంది. మత్స్యకారులకు రొయ్య పిల్లలను పట్టడంలో అవసరమైన నైపుణ్యం లేకపోవడంతో జలాశయంలోనే
మత్స్యకారులకు నైపుణ్యం కరవు
న్యూస్టుడే, బోయినపల్లి
రొయ్య పిల్లలు వదులుతున్న అధికారులు
మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జలాశయాల్లో చేప పిల్లలతోపాటు రొయ్యల పిల్లలను వదులుతుంది. మత్స్యకారులకు రొయ్య పిల్లలను పట్టడంలో అవసరమైన నైపుణ్యం లేకపోవడంతో జలాశయంలోనే అవి ఉంటున్నాయి. దీంతో వాటిని పట్టడంలో శిక్షణ ఇప్పించడానికి ఇటీవల ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపగా అనుమతి వచ్చింది. ఈ మేరకు త్వరలోనే మధ్యమానేరు జలాశయం పరిధిలోని మత్స్యకారులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వారికి ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు), ఎగువ మానేరు (అప్పర్), అన్నపూర్ణ జలాశయాలు ఉన్నాయి. రాజరాజేశ్వర జలాశయం, ఎగువ మానేరులో మూడేళ్లగా చేప పిల్లతోపాటు రొయ్య పిల్లలను అధికారులు వదులుతున్నారు. ప్రస్తుతం సంవత్సరంలో ఈ రెండింటితోపాటు అన్నపూర్ణ జలాశయంలో కూడా వదిలారు. మూడేళ్లలో రెండు జలాశయాల్లో 64,79,450 లక్షల రొయ్య పిల్లలను వదలగా, 2021-22లో 37,50,00 విడిచిపెట్టారు. నెల రోజుల వయస్సు ఉన్న 100 గ్రాముల బరువు ఉన్న వాటిని వదులుతుండగా 4 నుంచి 5 నెలల వ్యవధిలో సుమారు 450 గ్రాముల బరువుకు పెరుగుతుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు జలాశయాల్లో రొయ్యలు అధికంగా లభిస్తాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.400 వరకు పలుకుతుంది. మత్స్యకారులు వ్యాపారులకు కిలో రూ.200లకే విక్రయిస్తున్నారు. కాగా ఏటా రాజరాజేశ్వర జలాశయంలో రొయ్యలను వదులుతున్నప్పటికి వీటిని పూర్తిస్థాయిలో పట్టడం లేదు. ఇందుకు సరైన నైపుణ్యం లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం మత్స్యకారుల ఉపాధి అవకాశాలపై చూపుతుంది.
నీరు అధికంగా ఉండటంతో...-తిరుపతి, మత్స్యకారుడు, కొదురుపాక
జలాశయంలో నీరు అధికంగా ఉండటంతో రొయ్యలు లభించడం లేదు. వాటిని పట్టడంలో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణతో వారికి ప్రయోజనం కలుగుతుంది. బుట్టలు, వలలు, తెప్పలు, మోపెడ్లు ఉచితంగా అందించాలి.
త్వరలోనే శిక్షణ ఇస్తాం- శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి
రాజరాజేశ్వర జలాశయంలో ఏటా వదులుతున్న రొయ్యలను మత్స్యకారులు పూర్తిస్థాయిలో పట్టడం లేదు. నైపుణ్యం లేకపోవడం వల్ల సాధ్యపడటం లేదని తెలిసింది. ఇందుకోసం వారికి త్వరలోనే శిక్షణ శిబిరం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జలాశయంలో రొయ్యలు పుష్కలంగా ఉన్నాయి. రాయితీపై మోపెడ్, తెప్పలు, వలలు అందించేందుకు ప్రతిపాదనలు పంపిస్తాం.
శిబిరం ఏర్పాటుకు కార్యాచరణ
రాజరాజేశ్వర జలాశయం పరిధిలోని 1,024 మంది మత్స్యకారులతో మార్కెటింగ్ సొసైటీ ఏర్పాటు చేశారు. రొయ్యలను పట్టడంలో ఎదురవుతున్న సమస్యలను మత్స్యకారులు అధికారులకు వివరించారు. దీంతో నిష్ణాతులైన మత్స్యకారులను ఖమ్మం జిల్లా నుంచి రప్పించి ఇక్కడి వారికి శిక్షణ ఇప్పించాలని అధికారులు భావిస్తున్నారు. వెయ్యి మందిని మూడు బృందాలుగా విభజించి ఈ నెల 27 తరవాత మూడు రోజులు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే వలలు, మోపెడ్, తెప్పలు అందించడానికి చర్యలు తీసుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM