బదిలీల బేరం.. ఇదేం ఘోరం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓ ఉపాధ్యాయుడు పరస్పర బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన ఓ
ఒక్కో ప్రాంతానికి రూ.10 లక్షల డిమాండ్
ఒప్పందాలు కుదుర్చుకుంటున్న ఉపాధ్యాయులు
న్యూస్టుడే-కరీంనగర్ విద్యావిభాగం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓ ఉపాధ్యాయుడు పరస్పర బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు బదిలీ కోసం ఫోన్లో ఆయన్ను సంప్రదించారు. సదరు ఉపాధ్యాయుడు మీ నుంచి కొంత ఆశిస్తున్నట్లు సమాధానమిచ్చి, బయట పెద్దమొత్తంలో నడుస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లాకు బాగా డిమాండ్ ఉందని బేరాలు ఆడారు. దాదాపు రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తూ సంభాషించారు. ఇది గురువారం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.
కొత్త జిల్లాలకు కేటాయింపుల అనంతరం ఉపాధ్యాయులు పలువురు పరస్పర బదిలీలపై దృష్టి నిలిపారు. వారు కోరుకుంటున్న జిల్లాకు సాధారణ బదిలీల్లో వెళ్లే అవకాశం బంద్ కావడంతో పరస్పర బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే లక్షల రూపాయలను ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. కొందరు ఉపాధ్యాయులు ఈ వ్యవహారానికి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. స్థానికతకు ప్రాధాన్యం లేకుండా సీనియారిటీ ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపులు జరపడంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత జిల్లాలకూ దూరంగా పక్క జిల్లాలకు వెళ్లారు. ఉపాధ్యాయులుగా ఉన్న భార్య, భర్తలు తలో జిల్లాకు కేటాయించారు. ఇలాంటి వారు పరస్పర బదిలీల కోసం ఎదురుచూస్తూ ఇలాంటి అడ్డదారులను వెతుక్కుంటున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మార్గదర్శకాలే జారీ తరువాయి కావడంతో పరస్పర బదిలీల బేరసారాలు ఉమ్మడి జిల్లాలో మరింత ఊపందుకున్నాయి.
జిల్లా, మండలాన్ని బట్టి డిమాండ్
పరస్పర బదిలీపై డబ్బులు తీసుకుని ఎక్కడికైనా వెళ్లేందుకు ముందుకు వస్తున్న వారు ఇందు కోసం జిల్లా, మండలాన్ని బట్టి లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ రకాలు వ్యాపారాలున్న వారు, స్పౌజ్ కేటగిరిలోని వారు ఇలా బదిలీపై వచ్చేందుకు అత్యధికంగా ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఆర్ఏ పొందే అవకాశం గల బడులకు ఇంకా ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. సర్వీసు ఎక్కువగా ఉన్న మరికొందరు స్థానిక జిల్లాకు వెళ్లేందుకు పరస్పర బదిలీ ఇచ్చే వారి కోసం వెతుకుతున్నారు. పదవీ విరమణకు తక్కువ కాలం ఉన్న వారు అందినంత దండుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.
విద్యాశాఖ దృష్టికి సమాచారం
ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి సందేశాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కేటాయించిన జిల్లా, పాఠశాల పేరు, చిరునామా, కేటగిరి, కోరుకుంటున్న జిల్లా, చరవాణి నంబర్లను వాటిల్లో పెడుతున్నారు. వీటి ఆధారంగా పరస్పర బదిలీల బేరసారాలు ప్రారంభమయ్యాయి. గురువారం వాట్సాప్ల్లో చక్కర్లు కొట్టిన ఇద్దరు ఉపాధ్యాయుల పరస్పర బదిలీ కోసం జరిగిన సంభాషణ, డబ్బుల డిమాండ్ వ్యవహారాన్ని ఓ ఉపాధ్యాయ సంఘ నేత రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారి చెప్పినట్లు సంఘ నేత తెలిపారు.
ఉపాధ్యాయులు ఆలోచించాలి -క్యాదాసి సారయ్య, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, టీపీటీయూ
బదిలీ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి ఉపాధ్యాయ పోస్టులను వ్యాపారంగా మార్చడం మంచిది కాదు. జిల్లాలు మారాలి అనుకుంటే మానవతా దృక్పథంతో మరొకరికి అవకాశం కల్పించి ఆదర్శంగా నిలవాలి. జిల్లా మారడం కోసం అప్పులు చేసి తిప్పలు పడవద్దు. ఉపాధ్యాయ రంగానికి చెడ్డపేరు తీసుకురావద్దు.
* ఉమ్మడి జిల్లాలోని కొత్త జిల్లాల నుంచి కరీంనగర్కు పరస్పర బదిలీకి రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు.
* కరీంనగర్ జిల్లా అనంతరం సిద్దిపేట, హన్మకొండ జిల్లాలకు పరస్పర బదిలీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు బేరాలు జరుగుతున్నట్లు సమాచారం.
* రాజన్న సిరిసిల్ల,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వచ్చేందుకు అంత మొగ్గు చూపకున్నా పరస్పర బదిలీ అవకాశం కోసం రూ.3 లక్షల వరకు డిమాండ్ పలుకుతుందని పలువురు ఉపాధ్యాయులే పేర్కొంటున్నారు.
* పెద్దపల్లి జిల్లాలోని ఓ పండిత టీచర్ కరీంనగర్కు పరస్పర బదిలీపై వచ్చేందుకు రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం.
* ఒకే జిల్లాలోస్పౌజ్ కేటగిరిలో నియామకమైన సుల్తానాబాద్ మండలంలోని ఓ ఉపాధ్యాయుడు పరస్పర బదిలీపై ఇక్కడికి వచ్చే కరీంనగర్ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి నుంచి రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం