రహదారులపై యమగండాలు
సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలో తంగళ్లపల్లి మండలం నేరెళ్ల-జిల్లెల్ల మధ్య రహదారిలో ప్రమాదకరమైన మలుపులున్నాయి. ఈ రహదారిపై ఏడు నెలల క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు మూలమలుపు వద్ద అదుపుతప్పి
ప్రమాదాల్లో రాష్ట్రంలో జిల్లా రెండోస్థానం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
ఇరుకుగా ఉన్న వెంకట్రావ్పల్లిలోని మూడు రహదారుల కూడలి
* సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలో తంగళ్లపల్లి మండలం నేరెళ్ల-జిల్లెల్ల మధ్య రహదారిలో ప్రమాదకరమైన మలుపులున్నాయి. ఈ రహదారిపై ఏడు నెలల క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు మూలమలుపు వద్ద అదుపుతప్పి పడిపోయారు. లక్ష్మి తలకు తీవ్రగాయమైంది. ఇప్పటి వరకు వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చు చేసినా కోలుకోలేదు.
* వేములవాడ-చందుర్తి రహదారిలో హన్మాజీపేట మూలమలుపు వద్ద ఏడాది క్రితం నిమ్మపల్లికి చెందిన యువకుడు సంజీవ్ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజీవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ రహదారిపై ఎక్కడా వేగనిరోధకాలు, ప్రమాద సూచీలు లేవు. వాహన వేగాలకు అదుపు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చింది.
జిల్లాలోని రహదారుల వెంట ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. కొందరు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు దివ్యాంగులుగా మారుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై జరిగిన అధ్యయనంలో జిల్లాలో 29 శాతం ప్రమాదాలు పెరిగాయి. ఈ లెక్కన రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో ఉంది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. వీటిలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణంలోనే ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారులు, పట్టణాల్లో డ్రంకైన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మితిమీరిన వేగాన్ని పసిగట్టేందుకు స్పీడ్గన్ను ఉపయోగించి పర్యవేక్షిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంత రహదారులు కనీసం నిర్వహణ, పర్యవేక్షణ లేక ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి.
నిర్వహణకు నిధుల్లేక...
జిల్లా వ్యాప్తంగా 18 చోట్ల ప్రమాదకర ప్రాంతాలను రవాణా, పోలీసుశాఖలు గుర్తించాయి. గడిచిన ఏడాదిలో ప్రజల్లో సొంత వాహనాల వినియోగం పెరిగింది. ఫిబ్రవరిలో మేడారం జాతర ఉంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లాలోని రాజన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల మీదుగా వాహనాల రాకపోకలతో రహదారులు రద్దీగా మారాయి. రోడ్లు ప్రమాదకరంగా ఉన్న చోట కనీస జాగ్రత్తలు ఊసేలేదు. పట్టణంలో సిరిసిల్ల-కామారెడ్డి రహదారిలోని ప్రధాన కూడళ్ల వద్ద కనీసం జీబ్రాక్రాసింగ్లు లేవు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని పోలీసుశాఖ నుంచి రహదారులు, భవనాలశాఖకు నివేదికలు వెళ్తున్నా నిధుల లేమితో వాటిని పక్కన పెడుతున్నారు. దీంతో ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
నేరెళ్లలోని మూలమలుపు
మార్పు తీసుకొస్తున్నాం - రాహుల్ హెగ్డే, ఎస్పీ
రహదారులపై ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంటు బృందంతో తనిఖీలు చేపడుతున్నాం. జిల్లాలో ప్రధాన రహదారులపై వెళ్లేటప్పుడు ఏ వైపు వెళ్లేవారు అదే వరుసలో వెళ్లాలి. రహదారిపై ప్రయాణంలో నిబంధనలు పాటించేలా మార్పు తీసుకొస్తున్నాం. జిల్లాలో తరచూ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు, వేగాన్ని నియంత్రించేలా తనిఖీలు చేపడుతున్నాం. ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామీణ పోలీస్స్టేషన్ల పరిధిలో వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని మద్యం తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలని దిగువ స్థాయి అధికారులకు సూచించాం.
ప్రమాదకర ప్రాంతాలివే...
సిరిసిల్ల పట్టణంలో రగుడు, పాతబస్టాండ్ కూడలిలో ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ కాలిబాటలో వెళ్లేవారు రోడ్డు దాటేందుకు ప్రత్యేక జీబ్రాక్రాసింగ్లు లేవు. అసలు సిరిసిల్ల పట్టణంలో ఎక్కడా రహదారి భద్రతను పాటించేలా సూచికలు కనిపించవు. రహదారి విస్తరణ పనులు జరిగి మూడేళ్లు పూర్తయినా కనీస జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సిరిసిల్ల-కామారెడ్డి రహదారిలో సర్దాపూర్, పెద్దూరు, ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద రహదారి ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగతున్నాయి.
* వేములవాడలో ఆరెపల్లి, సంకెపల్లి బస్టాండ్లు, రెండవ బాహ్యవలయ రహదారి, శాత్రాజుపల్లి, నాంపల్లి వద్ద మూడు రహదారుల కూడలి ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఎలాంటి సూచికలు ఉండవు. కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు వేములవాడకు వెళ్లేలా సూచికలు లేవు. రహదారి విభాగిని లేకపోవడంతో రాత్రి సమయంలో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివరాత్రి జాతర సమయంలో మాత్రం పోలీసు చెక్పోస్టును ఏర్పాటు చేసి తర్వాత వదిలేస్తారు.
* సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలో తంగళ్లపల్లి మండలం నేరెళ్ల-జిల్లెల్ల, తంగళ్లపల్లి శివారు పెద్దమ్మనగర్లో ఆరు ప్రమాదకర మూల మలుపులున్నాయి.
* చందుర్తి మండలం లింగన్నపేట, కోనరావుపేట మండలం మల్కపేట వద్ద మూలమలుపు వంపు ఎక్కువగా ఉంది. వాహనాల వేగాన్ని నిరోధించేలా రహదారిపై ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవు.
* బోయినపల్లి మండలం కొదురుపాకలో మూడు రహదారుల కూడలి నుంచి నాలుగు వరుసల వంతెన రహదారి ప్రారంభమయ్యే చోట రోడ్డు విస్తారంగా ఉంది. కానీ ఏ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎలా వెళ్లాలనే మార్జిన్లు గానీ, సూచికలు గానీ లేవు. వెంకట్రావ్పల్లి మూడు రహదారుల కూడలి ఇరుకుగా ఉండటం వాహనాలు సాఫీగా వెళ్లలేని పరిస్థితి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
262.. ఉఫ్ఫ్ఫ్.. పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM