ఇక పాఠశాలల్లో వేలిముద్రతో హాజరు
ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు రెండేళ్ల పాటు రెండేళ్లుగా మూలన పడిన పరికరాల మనుగడపై గత జూన్లో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు.
25లోగా మరమ్మతులు పూర్తి.. 1 నుంచి అమలు!
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు రెండేళ్ల పాటు రెండేళ్లుగా మూలన పడిన పరికరాల మనుగడపై గత జూన్లో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు. వినియోగం లేక చాలా చోట్ల పరికరాలు పనికి రాకుండా పోయాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటికి మరమ్మతులు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 16 నుంచి 25 వరకు మండలాల్లో ఒక చోట మెకానిక్లు వచ్చి మరమ్మతు చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలు తిరిగి వినియోగంలోకి రానున్నాయి. సెప్టెంబరు 1 నుంచి వేలిముద్రల ద్వారా హాజరు విధానం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
మూలన పడిన పరికరాలు
కొవిడ్ ఉద్ధృతితో దాదాపు రెండేళ్లు పాఠశాలలు తెరుచుకోలేదు. ఆన్లైన్లో పాఠాలు కొనసాగాయి. గతేడాది సెప్టెంబరు నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నా పాత పద్ధతిలోనే హాజరు విధానం అమలవుతోంది. కాగా నెలల తరబడి బయోమెట్రిక్ పరికరాలు మూలన ఉండటంతో పాడయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో బయోమెట్రిక్ విధానాన్ని తిరిగి ప్రారంభించేందుకు పాఠశాలల్లో పరికరాల వాస్తవ పరిస్థితిపై సమాచారం సేకరించారు. ఇందులో అత్యధికంగా పని చేయడం లేదని తేలింది.
మండల స్థాయిలో మరమ్మతు
బయోమెట్రిక్ పరికరాలను మండల స్థాయిలో మరమ్మతు చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలవుతున్న 14 జిల్లాల్లో పరికరాల మరమ్మతుకు మంగళవారం ఉత్తర్వులు అందాయి. జిల్లాలో 632 అడాప్టర్లు, 409 యాంటెన్నాలు, 431 ప్లగ్స్ ప్లేల్లు పాడయ్యాయి. వీటన్నింటినీ మరమ్మతు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో 1,383, ఆంగ్ల మాధ్యమంలో 30,120, ఉర్దూ మాధ్యమంలో 800 మంది విద్యార్థులు చదువుతుండగా, 2,274 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
బోగస్ హాజరుకు చెక్
సర్కారు బడుల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. స్థానికంగా నివాసం ఉండకుండా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో సమయానికి హాజరు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. సకాలంలో విధులకు హాజరు కాకున్నా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో మరుసటి రోజు హాజరు రిజిస్టరులో సంతకాలు చేసుకుంటున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖ దృష్టికి వెళ్లాయి. దీంతో బోగస్ హాజరు విధానానికి అడ్డుకట్ట వేసేందుకు 2018లో బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దాదాపు రెండేళ్ల పాటు వేలిముద్రల విధానంలో హాజరు నమోదు అమలైంది. 2020 మార్చిలో కొవిడ్ కారణంగా రద్దయింది.
ఆదేశాలు వచ్చాయి: విజయ్కుమార్, సమగ్ర శిక్ష జిల్లా సమన్వయకర్త
జిల్లాలోని పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలకు మరమ్మతు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 25 వరకు పాత మండలకేంద్రాలకు వాటిని తీసుకెళ్లాలి. మరమ్మతు పూర్తయిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలో బయోమెట్రిక్ విధానం అమలులోకి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!