ఇసుక దందా ఆగేనా..!
జగిత్యాల జిల్లాలో ఇసుక దందా మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలువురు గోదావరి తీర గ్రామాల్లో పెద్దమొత్తంలో ఇసుక నిల్వలను ఏర్పాటు చేసుకొని అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలోని ధర్మపురి, బీర్పూర్, రాయికల్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం
పల్లెల్లో అక్రమ నిల్వలు
న్యూస్టుడే, ధర్మపురి
తీర గ్రామంలో ఇసుక నిల్వలు
జగిత్యాల జిల్లాలో ఇసుక దందా మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలువురు గోదావరి తీర గ్రామాల్లో పెద్దమొత్తంలో ఇసుక నిల్వలను ఏర్పాటు చేసుకొని అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలోని ధర్మపురి, బీర్పూర్, రాయికల్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం తదితర తీరప్రాంత గ్రామాల్లోంచి పట్టణాలకు ఇసుక ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖాధికారులు నిఘా ఏర్పాటు చేయకపోవడంతో అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తున్నారు. తీరప్రాంతాల్లో ప్రభుత్వమే ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మోక్షం కలగడం లేదు. ఉదయం మామూలుగానే ఉండగా రాత్రి సమయంలో ధర్మపురి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇసుక ట్రాక్టర్లు తరలుతున్నాయి. గోదావరి నీటిమట్టం బాగానే ఉండటంతో ముందుగానే కుప్పలుగా పోసుకున్న నిల్వల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న అనంతరం పైస్థాయి నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. దీంతో మండల స్థాయి అధికారులు సైతం తమకెందుకులే అనే ధోరణిలో ఉంటున్నారు. తీరప్రాంత మండలాల్లోని ఒక్కో గ్రామంలో సుమారుగా 100కు పైగా ఇసుక కుప్పలు ఉన్నాయి. ఇలా నిలువ ఉంచిన ఇసుకకు ఇష్టారాజ్యంగా ధర పెంచుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లను అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
గతంలో ఇసుక ట్రాక్టర్లు ఢీ కొట్టడంతో పలువురు గాయాల పాలవగా, ఒకరిద్దరు మృత్యువాత పడిన ఘటనలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరముంది. ఇసుక అక్రమ రవాణా విషయాన్ని ‘న్యూస్టుడే’ ఎస్సై కిరణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా ధర్మపురి మండలంలో నుంచి ఇసుక రవాణా పూర్తిగా తగ్గిందన్నారు. ప్రభుత్వ పనులకు మాత్రమే ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇస్తున్నారన్నారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
దొంతాపూర్ మార్గంలో దెబ్బతిన్న రహదారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజామాబాద్ను గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. -
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిరసన
[ 07-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం, రికార్డులను ఎత్తుకెళ్లిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీతారాణి తెలిపారు. -
భాజపాశ్రేణుల్లో జోష్!
[ 07-05-2024]
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు.. -
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. -
ఇలాగైతే ఓటేసేదెలా?
[ 07-05-2024]
సినిమా థియేటర్లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు. -
ఇదీ మా ఎజెండా
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి. -
భాజపాను ఇంటికి సాగనంపాలి
[ 07-05-2024]
గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన నరేంద్రమోదీని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న భాజపాను ఇంటికి సాగనంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
ప్రచార ఖర్చులు విధిగా సమర్పించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార ఖర్చుల వివరాలను విధిగా సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. -
ఈవీఎం కమిషనింగ్ పూర్తి చేయాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా రామగుండం నియోజకర్గం పరిధిలో నిర్వహించే ఓటింగ్కు సంబంధించి ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్ఖాన్ సోమవారం పరిశీలించారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
[ 07-05-2024]
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, మే 13న పోలింగ్ సజావుగా జరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం