ఇరు పార్టీల మధ్య ‘ఇసుక’ దుమారం
ఇసుక రీచ్ల నిర్వహణపై నేతల పరస్పర ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు ఏడాది ముందే రాజకీయం వేడెక్కింది. శాసనసభ్యుడు దాసరి మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుల మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతలకు దారి తీసింది.
పెద్దపల్లిలో వేడెక్కిన రాజకీయం
ఓదెల మల్లన్న ఆలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే విజయరమణారావును
అదుపులోకి తీసుకుంటున్న ఏసీపీ సారంగపాణి
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి: ఇసుక రీచ్ల నిర్వహణపై నేతల పరస్పర ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు ఏడాది ముందే రాజకీయం వేడెక్కింది. శాసనసభ్యుడు దాసరి మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుల మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఓదెల ఆలయంలో విజయరమణారావును పోలీసులు అరెస్టు చేసి ధర్మారం ఠాణాకు తరలించిన అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పెద్దపల్లిలోని ఇంటి నుంచి ఓదెలకు బయల్దేరుతుండగా ఎస్సై రాజేశ్ ఆధ్వర్యంలో గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో తెరాస, కాంగ్రెస్ శ్రేణులు పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో వేర్వేరుగా దిష్టిబొమ్మల దహనాలు, రాస్తారోకోలు చేపట్టారు.
పరస్పర ఆరోపణలు
మానేరు పరీవాహక ప్రాంతాలైన సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో మూడేళ్లుగా రాష్ట్ర గనుల శాఖ ఆధ్వర్యంలో ఇసుక రీచ్లు నిర్వహిస్తున్నారు. వీటిని నిర్వహించే గుత్తేదారుల నుంచి శాసనసభ్యుడు మనోహర్రెడ్డి పెద్దఎత్తున ముడుపులు తీసుకున్నారని కాంగ్రెస్ నేత విజయరమణారావు ఆరోపిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సైతం ఇసుక రీచ్ల వద్దకు అనుచరులతో వెళ్లి గుత్తేదారుల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని మనోహర్రెడ్డి ఆరోపించారు.
మాటల యుద్ధం.. ప్రజలకు ఇబ్బందులు
రీచ్ల నుంచి ఇసుక తరలించే వాహనాల రాకపోకలతో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల్లో రహదారులు దెబ్బతింటున్నాయి. గుంతలమయమైన రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజల వినతులను గుత్తేదారులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విజయరమణారావు ఇటీవల ఓదెల మండలం మడక నుంచి గుంపుల వరకు పాదయాత్ర నిర్వహించారు. సెప్టెంబరు 26న పొత్కపల్లిలో మాట్లాడుతూ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. అక్టోబరు 2న ఎమ్మెల్యే ఓదెల మల్లికార్జున ఆలయంలో శివలింగంపై ప్రమాణం చేసి ఇసుక ముడుపుల వ్యవహారంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అప్పటి నుంచి తెరాస, కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో రెండు పార్టీల అనుచరులు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. మరోవైపు రీచ్ల వద్ద ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల మాటేమో గానీ మానేరు పరీవాహక గ్రామాల ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM