లోలెవల్ వంతెలకు మోక్షమేది?
వానకాలం వచ్చిందంటే ధర్మపురి-జగిత్యాల రహదారి మధ్యన రెండు లోలెవల్ వంతెనలపై రాకపోకలు నిలిచిపోతూ ప్రజలకు అసౌకర్యంగా మారుతున్నాయి. ఏటా వానకాలంలో ఆరు నెలల్లో ఈ రహదారి పరిధిలోని మూడు జిల్లాలకు వెళ్లాల్సిన ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు.
వానకాలంలో ఏటా కడగండ్లే
వర్షాలకు వరద రోడ్డెక్కి ప్రవహించే నేరెళ్లగుట్ట ప్రాంతం
న్యూస్టుడే, ధర్మపురి: వానకాలం వచ్చిందంటే ధర్మపురి-జగిత్యాల రహదారి మధ్యన రెండు లోలెవల్ వంతెనలపై రాకపోకలు నిలిచిపోతూ ప్రజలకు అసౌకర్యంగా మారుతున్నాయి. ఏటా వానకాలంలో ఆరు నెలల్లో ఈ రహదారి పరిధిలోని మూడు జిల్లాలకు వెళ్లాల్సిన ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్-జగ్ధల్పూర్ 63 జాతీయ రహదారిపై జగిత్యాల వరకు వంతెలన్నీ నూతనంగా నిర్మించారు. ధర్మపురి మార్గంలో మాత్రం రెండు చోట్ల వదిలేశారు. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ధర్మపురి మండలంలోని నేరెళ్ల ఆకుసాయిపల్లె గుట్ట వద్ద లోలెవల్ వంతెన ఉంది. ఎగువ ప్రాంతాలైన బట్టపల్లి, సారంగాపూర్, నేరెళ్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడిందంటే గంటలోపు నీరంతా ఇక్కడికి చేరి వంతెనపై నుంచి ప్రవహించి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు పలుమార్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల పదిమార్లు వారధి వరద నీటిలో మునిగిపోయి, రాకపోకలు నిలిచి పోయాయి. అటు జగిత్యాల, ఇటు ధర్మపురి వైపు రాకపోకలు లేక ప్రజలు ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ హైలెవల్ వంతెన నిర్మించడానికి ప్రతిపాదించారు. దీనికి రూ. కోటి వ్యయం అవుతుందని ప్రతిపాదించినా నిధులు మంజూరు కాలేదు. జగిత్యాల మండలంలోని అనంతారం వంతెన పూర్తిగా తక్కువ ఎత్తులో ఉండటంతో వానాకాలం రాకపోకలు నిలిచి పోతున్నాయి. దీనితో ప్రజలు గంటల తరబడి రహదారిపై ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంటోంది. పురాతన వారధి ఎగువ ప్రాంతంలో నూతన వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లతో ప్రతిపాదించారు. నిధులు మంజూరు చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ రెండు వారధులకు నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం