ఆదర్శం.. రూ.1కే అంత్యక్రియల పథకం
‘రూపాయికే అంత్యక్రియల పథకం’ పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది. కరీంనగర్ నగర పరిధిలో పేదలు, అనాథలు ఎవరు చనిపోయినా సరే నగర పాలిక ద్వారానే రూ.1తో దహన సంస్కారాలు చేస్తున్నారు.
స్థానికేతరులకు ప్రయోజనం చేకూరేలా సంస్కరణలు
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
‘రూపాయికే అంత్యక్రియల పథకం’ పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది. కరీంనగర్ నగర పరిధిలో పేదలు, అనాథలు ఎవరు చనిపోయినా సరే నగర పాలిక ద్వారానే రూ.1తో దహన సంస్కారాలు చేస్తున్నారు. ‘రూపాయి’ పథకాన్ని 2019 జూన్ 15న ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. స్థానికేతరుల ప్రయోజనార్థ్థం కొత్త సంస్కరణ చేపట్టారు. పూర్తి వివరాలతో కథనం.
కరీంనగర్ నగరపాలక అంతిమ యాత్ర వాహనం
నగర నివాసి అయి ఉండి తెల్లకార్డు, ఆధార్కార్డుతో నగర పాలికకు రూపాయి చెల్లిస్తే అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒక్కో అంత్యక్రియకు నగరపాలక రూ.10 వేలు గుత్తేదారుకు చెల్లిస్తోంది. వీరితోనే శ్మశానవాటికలో దహనం, ఖననం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తారు. ఆయా మతాలు, ఆచారాలకు అనుగుణంగా దహన సంస్కారాలు నిర్వహిస్తారు. వీధుల్లో ఎవరూ చనిపోయినా సరే బాధిత కుటుంబ సభ్యులు స్థానిక కార్పొరేటర్, శానిటేషన్ జవాన్ దృష్టికి తీసుకెళ్తే ఒక రూపాయి తీసుకొని రసీదు ఇస్తారు. అప్పుడు ఆ గుత్తేదారు ఆయా మత సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేసే ప్రక్రియ మొదలవుతోంది.
రెండేళ్లలో 1,413 మందికి..
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రూ.1కే అంత్యక్రియలు నగరపాలక చేపడుతోంది. రెండేళ్లుగా పరిశీలిస్తే 1,413 దహన సంస్కారాలు నిర్వహించింది. అంతకుముందు 1,255 మందికి ఆఖరి సఫర్ అందించారు. కొవిడ్ సమయంలో అయినవారు చనిపోయిన సరే కనీసం దగ్గరికి వచ్చి చూడని సమయంలో కూడా నగరపాలక ముందుండి భేష్ అనిపించుకుంది. ఆ సమయంలో 353 శవాలకు కొవిడ్ నిబంధనల ప్రకారం దహన సంస్కారాలు చేశారు.
ఏటా నిధుల కేటాయింపు
అంతిమయాత్ర, దహన సంస్కారాలు చేసేందుకు నగర పాలక సంస్థ ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తోంది. పథకం ప్రారంభించిన మూడేళ్ల వరకు ఒక్కొక్కరికి రూ.8 వేలు చొప్పున ఇవ్వగా గతేడాది ఏప్రిల్ నుంచి రూ.10 వేలు ఇస్తున్నారు. ఇందుకు సాధారణ నిధులు రూ.90 లక్షలు కేటాయించారు.
దహన సంస్కారాలు ఇలా..
దహన సంస్కారాలు చేసేందుకు కావాల్సిన వస్తువులన్నీ సదరు గుత్తేదారు తీసుకొచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. నగరపాలక రెండు వాహనాలు అంతిమయాత్ర కోసం అందుబాటులో ఉంచింది. ఫ్రీజర్లు కూడా ఉండగా నిర్వహణ లేకపోవడంతో మూలనపడ్డాయి. హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించే అంత్యక్రియలకు 500 కిలోల కర్రలు, ఐదు లీటర్ల కిరోసిన్ లేదా సరిపడా ఇంధనం, పాడే, నాలుగు డప్పులు, ఇతర వస్తువులు ఉంటాయి. ముస్లింలకు అయితే గుంత తవ్వడం, కఫాన్ సెట్, మ్యాట్, పూలు ఇతర సామగ్రి ఉంచుతారు. క్రిస్టియన్లో గుంత తవ్వడం, శవపేటిక, డప్పులు, ఇతర వస్తువులు ఉంటాయి.
ఎక్కడి వారైనా సరే ధ్రువీకరిస్తే చాలు
జీవనోపాధికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పేదలు అద్దెకు ఉంటుండగా కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారికి అంత్యక్రియలు నిర్వహించడం భారంగా మారుతోంది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి నానావస్థలు పడుతున్న విషయాన్ని నగర మేయర్ వై.సునీల్రావు గుర్తించి పథకంలో మార్పులు చేశారు. ఆధార్కార్డు, రేషన్కార్డు ఎక్కడిదైనా సరే అద్దెకు ఉన్న ఇంటి యజమానులతో మాట్లాడి స్థానిక కార్పొరేటర్ ధ్రువీకరిస్తారు. జవాన్ సంతకం చేసి రూపాయి పథకం వర్తింపజేస్తారు. నగరంలో నివసించే ఇతర ప్రాంతాల పేదలందరికీ ఇది ఎంతో ఉపయోగపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434