అంతా ఇన్ఛార్జులే..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే ప్రతి విద్యార్థిని తెలుగు, ఆంగ్లం, గణితంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
21 మండలాలకు 8 మంది ఎంఈవోలు
మల్యాల మండల రిసోర్సు కార్యాలయ భవనం
న్యూస్టుడే, మల్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే ప్రతి విద్యార్థిని తెలుగు, ఆంగ్లం, గణితంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా పరీక్షల నిర్వహణలో మండల విద్యాధికారుల పాత్ర చాలా ముఖ్యమైంది. జిల్లాలో 8 మంది మాత్రమే మండల విద్యాధికారులు అదనపు బాధ్యతలపై విధులు నిర్వర్తిస్తున్నారు.
2017 నుంచి నియామకాల్లేవ్
ఆయా పాఠశాలల్లో పనిచేసే సీనియారిటీగల ప్రధానోపాధ్యాయులకే ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగిస్తుండటం కొన్నేళ్లుగా జరుగుతున్న తీరు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పనిచేసే జడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ఎంఈవోలుగా పనిచేసే అవకాశాలు మెండుగా ఉండటంతో డీఈవో పర్యవేక్షణలో నడిచే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులకు ఆ అవకాశం రాకపోవడంతో కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు ఎంఈవో నియామకాలపై నిషేధం ఉన్నందున ఆయా మండలాల్లో పనిచేసే ఎంఈవోలు ఉద్యోగ విమరణ పొందినా, ఇతర ఏ కారణంతోనైనా పోస్టు ఖాళీ అయితే ఆ మండలానికి చెందిన సీనియర్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించకుండా పక్క మండలానికి చెందిన ఎంఈవోకే అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తున్నారు.
మూడు మండలాల బాధ్యతలు ఒక్కరికే..
జిల్లాలోని 18 పాత మండలాలతోపాటు కొత్తగా ఏర్పడ్డ ఎండపెల్లి, భీమారం, బండలింగాపూర్ మండలాలను కలుపుకుని 21 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం 18 మండలాలకుగాను 8 మంది మండల విద్యాధికారులు పనిచేస్తున్నారు. మల్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయుడు మల్యాలతోపాటు పెగడపెల్లి, కొడిమ్యాల ఎంఈవోగా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. వెల్గటూరు ఎంఈవోకు ధర్మపురి, బుగ్గారం, కోరుట్ల ఎంఈవోకు మేడిపెల్లి, కథలాపూర్ ఎంఈవోకు ఇబ్రహీంపట్నం, జగిత్యాల గ్రామీణ ఎంఈవోకు జగిత్యాల అర్బన్, సారంగాపూర్ ఎంఈవోకు బీర్పూర్, మెట్పెల్లి, మల్లాపూర్ మండలాలు అదనంగా అప్పగించారు. రాయికల్, గొల్లపెల్లి మండలాలకు మాత్రమే వేర్వేరుగా ఎంఈవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఒక మండలానికి పూర్తిస్థాయిలో ఎంఈవో పనిచేసేవారు. కొన్నేళ్లుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో వారు విద్యార్థులకు బోధించే అవకాశం లేకుండాపోయింది. స్థానిక సంస్థల ఆధీనంలో పనిచేసే పాఠశాలలతోపాటు ప్రభుత్వ పాఠశాలలన్నీ జిల్లా విద్యాధికారి పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ఎంఈవోలకు ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలపై మాత్రమే పర్యవేక్షణపై ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం మండలంలోని ఓ సీనియర్ ప్రధానోపాధ్యాయుడిని నోడల్ ఆఫీసర్గా నియమించి ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది.
తొలిమెట్టు, ‘మన ఊరు-మన బడి’ పర్యవేక్షణ వారిదే
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో పిల్లల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తూ.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ పనుల పర్యవేక్షణ కూడా మండల విద్యాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. వివరాలను ఆన్లైన్లో ప్రభుత్వానికి నివేదించాలి. జిల్లాలో 188 జడ్పీ ఉన్నత, 84 ప్రాథమికోన్నత, 511 ప్రాథమిక పాఠశాలలతో పాటు 16 ఆదర్శ, 16 కస్తూర్బా, మరో 15 వరకు బాలికల, బాలుర గురుకులాలు, మైనార్టీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో దాదాపు 75 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎంఈవోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించకుండా వారితో ప్రతిరోజు విద్యార్థులకు ఒక పీరియడ్ బోధన చేయిస్తే మేలు జరుగుతుంది.
అదనపు బాధ్యతలతో ఇబ్బందే
- శ్రీనివాస్, ఎంఈవో మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి
ఎంఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించకముందు ప్రతి రోజు ఓ తరగతి విద్యార్థులకు ఒక పీరియడ్ బోధించే అవకాశం ఉండేది. ప్రస్తుతం నాకు అప్పగించిన మూడు మండలాల్లో పర్యటించి ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తున్నారో పరిశీలిస్తూ.. పాఠశాలల్లో సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం నెలకు రూ.600 టీఏ అందజేస్తుంది. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఎంఈవో పోస్టుల భర్తీని నిలిపివేశారు. అదనపు బాధ్యతలు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్