కమనీయం.. శ్రీనివాసుని కల్యాణం
తిరుమల గిరుల క్షేత్ర వైభవం కరీంనగర్లో సాక్షాత్కరించింది. సుందరాలంకరణలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుడు కొలువై ఉండగా.. తిరుమల వేద పండితుల మంత్రాలు మారుమోగగా కల్యాణం కనుల పండువగా జరిగింది.
మంగళసూత్రం చూపుతున్న అర్చకుడు
కరీంనగర్ సాంస్కృతికం, న్యూస్టుడే: తిరుమల గిరుల క్షేత్ర వైభవం కరీంనగర్లో సాక్షాత్కరించింది. సుందరాలంకరణలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుడు కొలువై ఉండగా.. తిరుమల వేద పండితుల మంత్రాలు మారుమోగగా కల్యాణం కనుల పండువగా జరిగింది. స్థానిక కళాకారుల అన్నమయ్య సంకీర్తనలు వీనుల విందు చేశాయి. కరీంనగర్ పద్మానగర్లో బుధవారం తితిదే దేవాలయం నిర్మాణ భూమి పూజ, శంకుస్థాపన చేసిన సందర్భంగా రాత్రి శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుని కల్యాణ మహోత్సవం వీక్షించేందుకు భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తితిదే ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, అన్నమయ్య వంశీకులు హరినారాయణాచార్యులు, తిరుమల అర్చకుల కల్యాణ క్రతువును వేదోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజతో కల్యాణ క్రతువు మొదలైంది. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్, ఎంపీ దామోదర్రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, భాస్కర్రావు, మేయర్ సునీల్రావు, పోలీసు కమిషనర్ సుబ్బారాయుడు కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ వేడుకలను వీక్షించారు. అందరికి ఆశీర్వచనాలు, తిరుపతి లడ్డూ ప్రసాదం వితరణ, అన్నదానం చేశారు. గోగుల ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి అలరించింది.
కల్యాణ మహోత్సవానికి హాజరైన నగరవాసులు
అలరించిన శోభాయాత్ర...
సాయంత్రం మంకమ్మతోట శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి పద్మానగర్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఏనుగులు, గుర్రాలు, మహిళల కోలాట ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు, గోవింద నామ స్మరణలతో యాత్ర సాగింది. పద్మానగర్ పద్మశాలీలు పద్మావతి ఆడబిడ్డగా భావించి సారె తీసుకొచ్చారు.
శోభాయాత్రలో గజరాజులు
కరీంనగర్లో తితిదే ఆలయం నిర్మాణం.. సంతోషకరం
భక్తుల కొంగు బంగారంగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానం కరీంనగర్ భక్తుల చెంతకు చేర్చాలని దేవాలయం నిర్మించడం సంతోషకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. బుధవారం భూమి పూజ క్షేత్రాన్ని సందర్శించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో, ధార్మిక కార్యక్రమాల అమలుకు తితిదే కృషి చేస్తుందన్నారు.
సారె తీసుకెళ్తున్న గంగుల, వినోద్కుమార్, సునీల్రావు దంపతులు
పూజ చేస్తున్న బండి సంజయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!