పరిశ్రమలతోనే అభివృద్ధి
పరిశ్రమలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పారిశ్రామిక ఉత్సవాన్ని నిర్వహించారు.
ఉత్పత్తులను పరిశీలిస్తున్న కలెక్టర్ యాస్మిన్బాషా, జడ్పీ ఛైర్పర్సన్ వసంత, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తదితరులు
జగిత్యాల, న్యూస్టుడే: పరిశ్రమలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పారిశ్రామిక ఉత్సవాన్ని నిర్వహించారు. జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, మంద మకరందు, ఆర్డీవోలు ఆర్.డి.మాధురి, టి.వినోద్కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో పరిశ్రమల పాత్ర కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్విండో విధానం అమలులోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వ పరంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నామని ప్రతిఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్ అన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల పారిశ్రామిక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి పథకాలతో అభివృద్ధి చెందుతున్నారని... మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మహిళలకు ఉపాధి చూపాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు మాట్లాడుతూ... రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చొరవతో పారిశ్రామికంగా రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా వివిధ మహిళా సంఘాలు చేసిన ఉత్పత్తులను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్బాషా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గత ఐదు రోజులుగా నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని 7న నియోజకవర్గ స్థాయిలో సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండగ నిర్వహించాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ప్రజలు చెరువుల వద్దకు బతుకమ్మలు, బోనాలతో ర్యాలీగా వెళ్లి కట్టమైసమ్మకు పూజలు చేసి అక్కడే భోజనం చేసేలా ఏర్పాటు చేయాలన్నారు. చెరువుల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, మంద మకరందు ఆర్డీవో ఆర్.డి.మాధురి, జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.