మరణంలోనూ... సమాజ హితం
మూడు దశాబ్దాల క్రితం రక్తదానం... రెండు దశాబ్దాల క్రితం నేత్రదానం అంటేనే ఎవరూ ముందుకు రాని పరిస్థితులు.
శరీరదానంతో వైద్య విద్యార్థులకు ప్రయోజనం
వరంగల్లోని వైద్య కళాశాలకు సరస్వతి మృతదేహాన్ని దానం చేస్తున్న కుటుంబ సభ్యులు (పాతచిత్రం)
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం: మూడు దశాబ్దాల క్రితం రక్తదానం... రెండు దశాబ్దాల క్రితం నేత్రదానం అంటేనే ఎవరూ ముందుకు రాని పరిస్థితులు. క్రమక్రమంగా స్వచ్ఛంధ, సామాజిక సంస్థల కృషితో ఆయా అంశాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. రక్త, నేత్రదానాలు వేలల్లో జరుగుతుండగా జీవన్మృతుల అవయవదానాలతో ఆపన్నులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. శరీరదానంతో వైద్య విద్యార్థుల పరిశీలనలు, ప్రయోగాలకు దోహదపడుతున్నారు. ఇలా... మరణంలోనూ సమాజహితం కోరుతూ నేత్ర, అవయవ, శరీరదానాలకు ముందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా రక్తదానంపై లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు అవయవదానంపై జీవన్దాన్ ట్రస్టు విశేష కృషి చేస్తున్నాయి. కాగా 2008లో గాంధీ జయంతి రోజున గోదావరిఖని కేంద్రంగా ఆవిర్భవించిన ‘సదాశయ ఫౌండేషన్’ నేత్ర, అవయవ, శరీరదానంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో మొదలైన శరీరదానాలు గత ఒకటిన్నర దశాబ్దాల్లో దాదాపుగా 90కి పైగా జరిగాయి. ఇటీవల గోదావరిఖనిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండు శరీరదానాలు జరగడం పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. నేత్ర, అవయవ, శరీర దానానికి సుమారు 50వేల మంది సదాశయ ఫౌండేషన్కు హామీ పత్రాలు ఇవ్వగా అందులో 10వేల వరకు శరీరదానాలకు సంబంధించినవే ఉన్నాయి. నేత్రదానాలైతే లెక్కకు మించి జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని అబ్బిడిపల్లి, ఓదెల గ్రామంలోని ప్రజలు నేత్రదానానికి అంగీకరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు.
స్థానికంగా అవగాహన
చనిపోయిన వారి నేత్రాలను సేకరించి హైదరాబాద్లోని కంటి ఆసుపత్రులకు పంపించడంతో పాటు నేత్రదాత దశదినకర్మ రోజున సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంస్మరణ సభలు నిర్వహించి నేత్ర, అవయవ, శరీరదానం ఆవశ్యకతలపై అవగాహనతో పాటు నేత్రదాత కుటుంబానికి అభినందన పత్రం ఇస్తున్నారు. ఏటా సదాశయ ఫౌండేషన్ వార్షికోత్సవం రోజున ఆ సంవత్సర కాలంలో నేత్ర, అవయవ, శరీరదానం చేసిన వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరిస్తున్నారు. ఆయా కార్యక్రమాలతో స్ఫూర్తిపొందిన ఎంతోమంది తమ మరణానంతరం శరీర దానాలకు హామీ పత్రాలను ఇస్తున్నారు. గోదావరిఖనికి చెందిన ప్రముఖ కార్మిక నాయకుడు మాదిరెడ్డి భాస్కర్రావు సతీమణి ఇందుమతి మృతిచెందగా ఆమె శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చేయడంతో రామగుండం ప్రాంతంలో శరీరదానాల ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత స్థానిక ప్రముఖ వైద్యుడు డాక్టర్ ముత్తిలింగం సతీమణి విమల శరీరాన్ని 2014లో వైద్య కళాశాలకు దానం చేశారు. ఆమె కుటుంబ సభ్యులంతా అవయవ, శరీరదానాలకు అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఇటీవల వరంగల్లో మృతి చెందిన విమల కుమార్తె సరస్వతి శరీరాన్ని వరంగల్లోని కొలంబో వైద్య కళాశాలకు దానం చేశారు. గోదావరిఖనికి చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలు ఇటీవల మృతి చెందగా ఆమె కోరిక మేరకు మృతదేహాన్ని గోదావరిఖనిలోని వైద్య కళాశాలకు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులు శ్రావణ్కుమార్ సోదరుడు, మామ శరీరాలను వైద్య కళాశాలలకు దానం చేశారు.
పరిశోధనలకు దోహదం
- డాక్టర్ రమేశ్బాబు, గోదావరిఖని
మరణించినా వైద్యపరిశోధనల కోసం ఉపయోగపడాలన్న ఉద్దేశంతో తొమ్మిదేళ్ల క్రితం మా అమ్మ మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించాం. కుటుంబ సభ్యులమంతా నేత్ర, అవయవ, శరీరదానానికి హామీ ఇచ్చాం. ఇటీవల వరంగల్లో మా అక్కయ్య మృతిచెందగా అక్కడి వైద్య కళాశాలకు దానం చేశాం. వారు మా నుంచి దూరమైనా సమాజహితానికి ఉపయోగపడటం మాకెంతో సంతృప్తినిస్తుంది. వెలకట్టలేని మానవ అవయవాలను మట్టిపాలు చేసేకన్నా దానం చేయడం వల్ల ఎందరికో పునర్జన్మను ప్రసాదించవచ్చు.
చట్టం తీసుకురావాలి
-శ్రావణ్కుమార్, సదాశయ ఫౌండేషన్
కొన్ని దేశాల్లో ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు అవయవ, శరీరదానం చేసేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద, సామాజిక సంస్థలకు సహకరించాలి. దాతల కుటుంబాలను సముచితంగా గౌరవించడంతో ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. వివిధ రంగాల్లోని ప్రముఖులు, వైద్యులు, ప్రజా ప్రతినిధులు అవయవ, దేహదానంతో ప్రజలకు స్ఫూర్తినివ్వాలి. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఎంతోమందికి మేలు జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!