నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది
ఈనాడు, కరీంనగర్, న్యూస్టుడే- జగిత్యాల: కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఈయన ఎంపీ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండటం ఈయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన తరువాత.. పార్టీ ముఖ్య నేతలు, జాతీయ నాయకత్వం నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్రెడ్డి వైపునకే మొగ్గు చూపారు. జగిత్యాల నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం.. ఈ ఎన్నికల్లో ఉపయోగకరంగా మారనుంది. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఉండటంతోపాటు రైతులతో జీవన్రెడ్డికి మంచి సంబంధాలు ఉండటం కలిసి వచ్చే అవకాశం ఉందని పార్టీ భావించినట్లు సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకుడిగా గుర్తింపు ఉండటంతోపాటు ఆయనకున్న అనుభవానికి పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యతనిచ్చి టికెట్ను కట్టబెట్టింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో భాజపా, భారాస అభ్యర్థుల్ని ప్రకటించడంతో వారు ప్రచారం సాగిస్తున్నారు. జీవన్రెడ్డి కూడా లోక్సభ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తున్నా.. ప్రస్తుతం అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలో దిగే అవకాశం ఉంది.
జగిత్యాలలో సంబరాలు
జీవన్రెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పలు వార్డుల్లో కార్యకర్తలు బాణాసంచా కాల్చారు.
పేరు : తాటిపర్తి జీవన్రెడ్డి, వయస్సు : 73, విద్యార్హత : బీఏ, ఎల్ఎల్బీ, భార్య : అహల్య
కుమారులు : రాంచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్రకృష్ణారెడ్డి
స్వస్థలం : బతికెపల్లి, పెగడపల్లి మండలం, నివాసం : జంబిగద్దె, జగిత్యాల
న్యాయవాది అయిన జీవన్రెడ్డి 1981లో మల్యాల సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి జగిత్యాల నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో కాంగ్రెస్లో చేరిన ఈయన ఇప్పటివరకు శాసనసభకు 11 సార్లు పోటీ చేశారు. ఇందులో ఆరుసార్లు గెలిచి, అయిదుసార్లు ఓటమి చెందారు. 2006, 2008లో కరీంనగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కేసీఆర్ చేతిలో రెండుసార్లు ఓటమి పాలయ్యారు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో , 2008లో వైఎస్సార్ హయాంలో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. 2019లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి శాసనమండలిలో అడుగుపెట్టారు. ప్రస్తుతం నిజామాబాద్ నుంచి బరిలో నిలుస్తూ తొలి గెలుపును అందుకుని పార్లమెంటులో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో జీవన్రెడ్డి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం