నిజామాబాద్లోనే పసుపు బోర్డు..
కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు.
సహకార విధానంలో చక్కెర కర్మాగారాలు
ఇందూరు సభలో అమిత్ షా
ప్రసంగిస్తున్న అమిత్షా
ఈనాడు, నిజామాబాద్: కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు. ఇది పసుపు రైతుల కోసం చేసిన పెద్ద పనిగా ఆయన కితాబిచ్చారు. నిజామాబాద్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఇందూర్ విశాల్ జనసభలో ఆయన ప్రసంగించారు. ఇప్పుడు పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడనే చర్చ సాగుతోందని.. మీరు మళ్లీ అర్వింద్ను గెలిపిస్తే నిజామాబాద్లోనే ఏర్పాటై తీరుతుందన్నారు. ఈ ప్రాంతంలో బీడీ కార్మికుల కోసం ఆసుపత్రి ఏర్పాటు ఆవశ్యకత ఉందని.. అది కూడా తప్పక ఏర్పాటు చేస్తామని.. ఇది మోదీ గ్యారంటీగా చెప్పారు. బోధన్, మెట్పల్లి ప్రాంతాల్లోని చక్కెర కర్మాగారాలు మూతపడటానికి భారాస, కాంగ్రెస్లే కారణమని ఆరోపించారు. వీటిని తెరిపించి రైతుకు మేలు జరిగేలా చేయటంతో పాటు సహకార విధానంలో నిర్వహించేలా చూస్తామన్నారు. అర్వింద్ను గెలిపించేందుకు తాను ఇక్కడి వచ్చానని.. సిద్ధులగుట్ట, డిచ్పల్లి రామాలయం, త్రివేణి సంగమ ప్రాంతం కందకుర్తి, బాసర సరస్వతిని తలచుకొంటూ ప్రసంగం ప్రారంభించారు. ఇక్కడ పోటీ చేస్తున్న ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని కలవాలంటే ఎక్కడ ఉంటారో వెతకాల్సిన పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేశారు. అర్వింద్ స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తారన్నారు.
పక్కన భాజపా అభ్యర్థి అర్వింద్, వేదికపై ఎమ్మెల్యేలు రాకేశ్రెడ్డి,
ధన్పాల్, నాయకులు యెండల, దినేష్, పల్లె గంగారెడ్డి, మోహన్రెడ్డి తదితరులు
కమల దళంలో జోష్..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా నిర్వహించిన సభకు ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రత్యర్థి పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రసంగించారు. ఓటర్లంతా 13న ఈవీఎంల బటన్ను గట్టిగా నొక్కాలని.. ఇక్కడ నొక్కితే ఇటలీలో షాక్ తగలాలని చమత్కరించారు. గడిచిన పదేళ్లలో కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి వివరించారు. ప్రతి నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. అది జరగాలా వద్దా? అంటూ సభికులను అడిగారు. వారు సానుకూలంగా స్పందిస్తూ.. హుషారు చాటుకున్నారు. సభకు పెద్దసంఖ్యలో జనం రావడంతో భాజపా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యేలు రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు దినేష్ కులాచారి, సత్యనారాయణ, నాయకులు వెంకటరమణి, గద్దె భూమన్న, పోతాంకర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లపై రేవంత్రెడ్డివి అబద్ధాలు
నా ప్రాణం ఉన్నంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తగ్గించే ప్రసక్తే లేదని మోదీ ప్రకటించినా రేవంత్రెడ్డి ఇంకా దీనిపై అబద్ధాలే మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే అబద్ధాలు చెప్పి మహిళలను మోసగించారు. ఓట్లు దండుకొన్నారు. మరోసారి రిజర్వేషన్ల అంశంతో మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పలు విశ్వవిద్యాలయాను మైనార్టీల పరం చేసి ఇతర వర్గాలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్సే. ఆరు గ్యారంటీలంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్.. తులం బంగారం, మహిళలకు రూ.2500, రూ.4 వేల పింఛను, రైతులకు రూ.500 బోనస్ అంటూ మభ్యపెట్టారు. అడ్డదారిలో దక్కిన అధికారం ఎక్కువ కాలం నిల్వదు. మోదీ ప్రపంచానికి దిక్సూచి. దేశ ప్రగతి కోసం ఆయనకు మద్దతుగా నిలవాలి. ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి.
ధర్మపురి అర్వింద్, భాజపా అభ్యర్థి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
-
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
-
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు నేడే