క్షేమంగా వెళ్లి వారంలోపే రండి!
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజులే ఉంది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.
13లోపే యాత్రలకు ముగింపు పలకండి
పోలింగ్ రోజు ఓటుకు సెలవివ్వొద్దు
న్యూస్టుడే,కరీంనగర్ పట్టణం, సుభాష్నగర్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజులే ఉంది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధం ఓటు మాత్రమేనని, ఈ విషయాన్ని మరచిపోకుండా హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటేస్తేనే సుపరిపాలన అందుబాటులోకి రానుంది.
ఆరు రోజులకే ప్రణాళిక
విద్యాసంస్థలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. దాదాపు పది రోజులుగా పిల్లలకు ఆటవిడుపు దొరికింది. ఖాళీ సమయంలో పిల్లలు, పెద్దలు సేద తీరాలని భావిస్తారు. మండే ఎండల్లో చల్లటి ప్రదేశాలకు వెళ్లేవారు కొందరైతే, తీర్థ యాత్రలకు వెళ్లడం, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించడం మరికొందరికి అలవాటు. 13న (సోమవారం) పోలింగ్ సందర్భంగా సెలవు కాగా ముందు రెండో శనివారంతో పాటు ఆదివారం సాధారణ సెలవులు. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయని ఇంటిల్లిపాదీ ఎక్కడికైనా వెళ్దామని భావించే అవకాశముంది. అయితే పోలింగ్ రోజును సెలవు దినంగా భావిస్తే సమున్నత లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్న విషయం మరచిపోకూడదు. ఎక్కడ ఉన్నా వచ్చి ఓటు వేయడానికే ఆ రోజు సెలవు ప్రకటించారని గుర్తుంచుకోవాలి. వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా ఒక రోజు ముందు స్వస్థలాలకు చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. పోలింగ్కు సరిగ్గా వారం రోజుల సమయం ఉన్నందున యాత్రలకు వెళ్లేవారు ఆరు రోజులకే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
పట్టణ ఓటరూ.. బద్దకించకండి
ప్రతి ఎన్నికల సమయంలో పల్లె ప్రాంతాల్లో అధికంగా, పట్టణ ప్రాంతాల్లో తక్కువగా పోలింగ్ నమోదవుతోంది. నగరాలు, పట్టణ ప్రాంత జనాలు ఓటేయడానికి ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణమన్న విమర్శలున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ విమర్శలు తిప్పికొట్టడానికి తమ చేతిలోని అస్త్రాన్ని సంధించాల్సిన అవసరం ఉంది.
అంతకు మించి సంధించాలి
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతలు పూర్తి కాగా మొదటి విడతలో 66.14 శాతం, రెండో విడతలో 66.71 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగో విడతలో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 77.26 శాతం నమోదైంది. ఈసారి ఎన్నికల్లో అంతకు మించి పోలింగ్ నమోదు కావాలంటే ఓటుహక్కు కలిగి ఉన్న వారంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి.
గంట పొడిగింపుతో ఉపశమనం
ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఈ క్రమంలో పోలింగ్ ప్రక్రియ కూడా అగ్ని పరీక్షగా మారింది. భానుడి ప్రతాపాన్ని గుర్తించిన ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. ఇది వృద్ధులు, మహిళలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఉదయం 7 గం.ల నుంచి 11 గం.లలోపు ఓటు వేసి రావడం ద్వారా ఎండదెబ్బ నుంచి ఉపశమనం ఉంటుంది. ఆ సమయంలో వీలు పడని వారికి సాయంత్రం 4 గం.ల నుంచి 6 గం.ల వరకు అవకాశం ఉంది.
ఊపిరిలూదాల్సింది యువతే..
యువతే దేశానికి ప్రాణవాయువు. ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం చాలా మంది స్వస్థలాలకు దూరంగా, పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈసారి పోలింగ్కు ముందు రోజు కూడా సెలవు వస్తున్నందున ఎక్కడ ఉన్నా సొంత ప్రాంతాలకు చేరుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది. యువ ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదిన వారవుతారు. వారు ఓటుహక్కు వినియోగించుకోవడంతో పాటు దివ్యాంగులు, వృద్ధులకు చేయూతనందించే ప్రయత్నం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM