విమ్స్లో అత్యవసర సేవలు మాత్రమే!
బళ్లారి విమ్స్ ఆసుపత్రిలో సాధారణ రోగులకు చికిత్స చేయరు. అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుతాయని బాధ్య సంచాలకుడు డా.గంగాధర్గౌడ నోటీసు ద్వారా తెలియజేశారు. ప్రధాన ద్వారం ముందు గోడలకు ఈ నోటీసు అతికించారు. బళ్లారి, విజయనగర
బళ్లారి, న్యూస్టుడే: బళ్లారి విమ్స్ ఆసుపత్రిలో సాధారణ రోగులకు చికిత్స చేయరు. అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుతాయని బాధ్య సంచాలకుడు డా.గంగాధర్గౌడ నోటీసు ద్వారా తెలియజేశారు. ప్రధాన ద్వారం ముందు గోడలకు ఈ నోటీసు అతికించారు. బళ్లారి, విజయనగర జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని కొవిడ్ రోగుల చికిత్సకు కేటాయించారు. వీరు మళ్లీ సాధారణ రోగులకు చికిత్స చేసే పరిస్థితి లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. విమ్స్కు రోజూ దాదాపు ఐదువేల మంది చికిత్సకు వచ్చేవారు. ఇందులో అత్యవసర వైద్యం దాదాపు 300 మందికి అవసరమయ్యేది. సుమారు 50 శస్త్రచికిత్సలు చేసేవారు. ప్రస్తుతం వివిధ విభాగాలను కొవిడ్ సేవలకు కేటాయించడంతో సామాన్య రోగులను చూసే అవకాశం లేకపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి సృష్టించారని సాధారణ రోగులు బాధపడుతున్నారు. వారు ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా రుసుములు వసూలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరంతరం సేవలు: విమ్స్లో అత్యవసర రోగులకు మాత్రమే చికిత్స చేస్తామని ఆసుపత్రి ముఖ్య పర్యవేక్షకుడు డా.అశ్వినికుమార్ సింగ్ పేర్కొన్నారు. అత్యసవర రోగులకు 24 గంటలూ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..