logo

సింధనూరు పోలీసుల ఆనందహేల

సింధనూరు డీఎస్పీ వెంకటప్ప నాయక్‌ రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపిక కావడంతో స్థానిక పోలీసులు ఆనందం పంచుకున్నారు. రాష్ట్రానికి చెందిన 21 మంది పోలీసు అధికారులు తమ విధుల్లో శ్లాఘనీయ సేవలందించిన నేపధ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా

Published : 27 Jan 2022 00:39 IST


డీఎస్పీ వెంకటప్ప నాయక్‌

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు డీఎస్పీ వెంకటప్ప నాయక్‌ రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపిక కావడంతో స్థానిక పోలీసులు ఆనందం పంచుకున్నారు. రాష్ట్రానికి చెందిన 21 మంది పోలీసు అధికారులు తమ విధుల్లో శ్లాఘనీయ సేవలందించిన నేపధ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకాలకు ఎంపికయ్యారు. కొద్ది నెలల కిందటే వెంకటప్ప నాయక్‌ సింధనూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి అనతికాలంలోనే ప్రజలకు దగ్గరయ్యారు. బాగా పనిచేసే కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తూ చక్కని ఫలితాలు రాబడుతున్నారు. తమ ఉన్నతాధికారికి రాష్ట్రపతి పతకం లభించడంతో సింధనూరు పోలీసుల్లో అమితానందం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని