గాంధీజీ రాకతో బళ్లారిలో స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపు
ఆజాదికా అమృత్ మహోత్సవం పురస్కరించుకుని బళ్లారిలో జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదురుగా ఉన్న రైల్వే స్టేషన్ ఆవరణలో మహత్మాగాంధీ విగ్రహాన్ని, బళ్లారి కంటోన్మెంట్లోని విమ్స్ ఆసుపత్రి అవరణంలో డా.బాబురాజేంద్రప్రసాద్ విగ్రహాన్ని శనివారం జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు ఆవిష్కరించారు
రైల్వే స్టేషన్ ముందు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి తదితరులు
బళ్లారి, న్యూస్టుడే : ఆజాదికా అమృత్ మహోత్సవం పురస్కరించుకుని బళ్లారిలో జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదురుగా ఉన్న రైల్వే స్టేషన్ ఆవరణలో మహత్మాగాంధీ విగ్రహాన్ని, బళ్లారి కంటోన్మెంట్లోని విమ్స్ ఆసుపత్రి అవరణంలో డా.బాబురాజేంద్రప్రసాద్ విగ్రహాన్ని శనివారం జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. మహత్మాగాంధీ 1921 అక్టోబరు 1న బళ్లారి రైల్వే స్టేషన్లో ఎనిమిది గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారు. 1934 మార్చిలో స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా నిధుల సేకరణకు గాంధీ బళ్లారికి వచ్చారన్నారు. గాంధీ రాకతో ఈ ప్రాంతానికి పోరాటం చేసే శక్తి వచ్చిందన్నారు. జిల్లాలో కూడ్లిగి, కొట్టూరు ప్రాంతం యువకులను సైనికులుగా తీర్చిదిద్దారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం, ఉప్పు సత్యాగ్రహం, తదితర పోరాటాల్లో పాల్గొన్న వారిని బళ్లారి అల్లీపురం జైల్లో బంధించారన్నారు.బళ్లారి ప్రస్తుతం విమ్స్ ఆసుపత్రి, అప్పటి అల్లీపురం జైల్లో జైలు జీవనం గడిపారు, దీనికి గుర్తుగా ఈ ప్రాంతంలో డా.బాబురాజేంద్రప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుల చరిత్ర, తదితర వాటిపై విమ్స్లో మ్యూజియం అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో లోక్సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్, పాలికె మేయర్ మోదపల్లి రాజేశ్వరి, మండలి అధ్యక్షుడు హనుమంతప్ప, బుడా అధ్యక్షుడు పి.పాలన్న, ఎ.పి.ఎం.సి. అధ్యక్షుడు ఉమేష్, జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి, ఎస్పీ సైదులు అడావత్, జిల్లా పంచాయతీ సీఈవో జి.లింగమూర్తి, ఏడీసీ మంజునాథ, విమ్స్ బాధ్య సంచాలకుడు డా.గంగాధరగౌడ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..