ఆ మైదానం రెవెన్యూ సొత్తు
నగరంలోని వివాదాస్పదమైన చామరాజపేట ఈద్గామైదానం రాష్ట్ర రెవెన్యూ శాఖ సొత్తుగా బృహత్ బెంగళూరు మహానగర పాలికె ప్రకటించింది. ఈ మేరకు పాలికె పడమటి విభాగం సంయుక్త కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.
ఈద్గామైదానం వద్ద గట్టి పోలీసు బందోబస్తు
బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్టుడే: నగరంలోని వివాదాస్పదమైన చామరాజపేట ఈద్గామైదానం రాష్ట్ర రెవెన్యూ శాఖ సొత్తుగా బృహత్ బెంగళూరు మహానగర పాలికె ప్రకటించింది. ఈ మేరకు పాలికె పడమటి విభాగం సంయుక్త కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తామని వక్ఫ్ మండలి వెల్లడించింది. ఖాతా చేసేందుకు సంబంధించిన దాఖలాలను సమర్పించాలని రెండు సార్లు మండలికి తాఖీదులు ఇచ్చినా సమాధానం ఇవ్వలేదని ఆయన తెలిపారు. రెవెన్యూ శాఖ రికార్డుల్లో రెవెన్యూ సొత్తుగా నమోదైనట్లు తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతించాలని చామరాజపేట నాగరిక ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. మైదానం ప్రజా ఆస్తి, స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగురేసేందుకు అనుమతించాలని పాలికె చీఫ్ కమిషనర్ తుషార్గిరినాథ్కు వినతి పత్రం అందజేసినట్లు వేదిక ప్రధాన కార్యదర్శి రుక్మాంగద తెలిపారు. మైదానానికి జయచామరాజేంద్ర ఒడెయర్ పేరు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. వివాదం మళ్లీ తెరపైకి రావడంతో మైదానం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరూ ప్రవేశించకుండా పోలీసు పహారా ఏర్పాటు చేశారు.
మైదానం వద్ద నినాదాలు చేస్తున్న ప్రతినిధులు
‘జెండా ఎగరేస్తాం’
బెంగళూరు (శివాజీనగర): ఈద్గా మైదానంలో పంద్రాగస్టుకు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని చామరాజపేట నాగరిక పౌర వేదికె ప్రకటించింది. ఈ మైదానానికి జయచామరాజేంద్ర ఒడెయరు పేరు పెట్టాలని స్థానిక నివాసుల సంఘం అధ్యక్షుడు రుక్మాంగద డిమాండ్ చేశారు. ఈద్గా మైదానం తమ ఆస్తి అని వక్ఫ్ బోర్డు నిరూపించుకోవడంలో విఫలమైన నేపథ్యంలో అది రెవెన్యూ శాఖకు చెందిన మైదానమని పాలికె ప్రకటించడంపై వేదికె ప్రతినిధులు హర్షాన్ని వ్యక్తం చేశారు. 75 ఏళ్లుగా ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు అవకాశమే దక్కలేదని స్థానికుడు, వేదికె ప్రతినిధి లహరి వేలు పేర్కొన్నారు. అన్ని సముదాయాల ప్రతినిధులు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని తాము ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. బక్రీద్కు గొర్రెల విక్రయం, రంజాన్కు సామూహిక ప్రార్థనలకు అవకాశంతో పాటు వినాయకచవితికి విగ్రహాల విక్రయం, స్థానిక విద్యార్థులు ఆడుకునేందుకు అనుమతించేలా ప్రభుత్వం, పాలికె చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు. మైదానం వద్ద బాణసంచా కాల్చి స్థానిక నివాసులు, కన్నడ సంఘాల ప్రతినిధులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం