logo

బ్యాంకులో మోసం.. క్యాషియర్‌ బలవన్మరణం

గౌరీబిదనూరు తాలూకా గుంటచిక్కనహళ్లిని కర్ణాటక బ్యాంక్‌ క్యాషియర్‌ సునీల్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది.

Published : 07 Oct 2022 06:53 IST

సునీల్‌ కుమార్‌

చింతామణి : గౌరీబిదనూరు తాలూకా గుంటచిక్కనహళ్లిని కర్ణాటక బ్యాంక్‌ క్యాషియర్‌ సునీల్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గౌరీబిదనూరు పరిధి కలూడిలోని కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ ఎస్‌.మణీంద్రరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి వివిధ బ్యాంక్‌ ఖాతాల్లో నుంచి రూ.84.78 లక్షలను తన ఖాతాకు మళ్లించుకుని పరారయ్యాడు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు గౌరీబిదనూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతి చెందిన సునీల్‌ కుమార్‌ క్యాషియర్‌గా, మణీంద్ర రెడ్డి మేనేజర్‌గా గతంలో ఎల్లొడు శాఖ బ్యాంకులో కలిసి పని చేశారు. మణీంద్రరెడ్డి వివరాలు సునీల్‌కు తెలిసి ఉంటాయని పొలీసులు భావించారు. దీంతో భయపడిన సునీల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు విచారణలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని